Tuesday, March 22, 2011

Million March

మిలియన్ మార్చ్ మామూలు విజయ౦ కాదు, అఖ౦డ విజయ౦... అమోఘవిజయ౦... అపూర్వవిజయ౦... అనిర్వచనీయమైన విజయ౦..! గర్వంగా ఫీల్ అవుతున్నా... అంతే కాదు, నిన్న జరిగిన మార్చ్ లో పాల్గోననందుకు చింతిస్తున్నా కుడా.....అనుకున్న కార్యక్రమాన్ని ఎన్నో అడ్డంకులకు ఓర్చి దిగ్విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు....




చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు ఫోటోలు చూసినపుడు... నా ఒంట్లోని రక్తం ఉడుకుతోంది.. నేనెందుకు అక్కడ లేనా అని... ఒళ్ళు జలదరిస్తోంది.. తెలంగాణా వాడినై పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. అందులోను ఈ కాలంలో ఉన్నందుకు, ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలను కనీసం ఇంటర్నెట్ లో చూసే భాగ్యం దొరికినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నా... ప్రతి తెలంగాణా వాడికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని చేకూర్చింది ఈ మిల్లియన్ మార్చ్ ...

దేవుడంటూ ఉంటె నేను ఒకటే కోరుకుంటా.. మరో జన్మంటూ ఉంటె దేవుడా, నన్ను మరో సారి కూడా ఈ తెలంగాణా వాడిగా పుట్టించు... ఈ తల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను....



ఈ ప్రభుత్వం మన ప్రజల సమస్యలను అసలు పట్టించుకోదా అనే ఒక నిరాశ, నిస్పృహలతో కూడిన సామాన్య తెలంగాణా వాడికి.... ఎన్ని రోజులు చేయాలా ఈ ఉద్యమం అన్న దిగులుతో... ఇక చాలు మన బతుకేదో మనం బతుకుదాం బానిస బతుకైన సరే, అనే ఒక చాతకాని తనం వస్తున్న తరుణం లో చేపట్టిన ఈ మిల్లియన్ మార్చ్ ఒక మంచి మానసిక ధైర్యాన్ని మాత్రమే కాదు సాధించే దాక తెగించి పోరాడుడే అని తెగించి పోరాడే తత్వాన్ని తెలంగాణా ప్రజల్లో ఎన్నో రెట్లు పెంచింది...

శత్రు చక్రభందంలో చిక్కుకున్న అభిమన్యుడి వలె ప్రతి తెలంగాణా వాడు అడుగడుగునా ఉన్న పోలీసు చక్రభంధాన్ని దాటుకుని ట్యాంక్ బాండ్ కు నేను సైతం అంటూ చేరుకున్న తీరు, మనవారి తెగింపు, స్థైర్యం, స్ఫూర్తి అమోఘం... అపూర్వం... అనిర్వచనీయం... మొత్తం 350 కి పైగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను, అడుగడుగునా చేస్తున్న తనికీలను సైతం దాటుకుంటూ, ఫోటోల్లోని ఒక్కొక్క తెలంగాణా పౌరుడిని చూస్తుంటే వారి మొహాల్లో ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఏదో సాధించాం అన్న ఒక ఫీలింగ్, తనను మించిన వాడు ఈ ప్రపంచంలోనే ఇంకొకడు లేదు అన్న రేంజ్ లో ఉంది ... ఇలాంటి స్ఫూర్తి, ఇలాంటి ఆనందం ప్రతి రోజు ఉండాలి మన వాళ్ళలో... మనం చూడాలి కూడా ... ఉండేలా మనం చేయాలి కూడా... ఆ భాద్యత మనమీదనే ఉంది..

ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప స్థాయిలో దిగ్విజయం చేసి, ప్రపంచానికే ఒక పాటాన్ని నేర్పించడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణా అభివందనాలు...

ఒక పక్క తెలంగాణా ప్రజలు మిల్లియన్ మార్చ్ కి సిద్ధం ఆతుంటే ప్రభుత్వం పోలీసు మార్చ్ చేయించింది తెలంగాణా జిల్లాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే, ఇది మన భాగ్య నగరమేనా అన్నట్లుంది... అరెస్టులతో తెలంగాణా ప్రజలను, నాయకులను, విద్యార్థులను ఎక్కడికక్కడే బంధించాలని చూస్తుంటే ఈ దశలోనూ తెలంగాణా వారు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, పైగా వారి ఆత్మస్థైర్యం రెట్టింపు అయి ఎలాగైనా ఈ మిల్లియన్ మార్చ్ లో నేను కూడా పాల్గొనాలని గట్టిగ నిశ్చయిన్చుకోనేలా చేసాయి...నర నరాన రక్తం ఉడికిపోతోంది..

ఇంకా తెలివిగా ప్రభుత్వం, మార్చ్ కి 24 గంటల ముందు మొత్తం ఒక లక్ష మందిని అరెస్టు చేసిందంటే అది నమ్మశక్యం కాదు.. కాని అది నిజం..నమ్మి తీరాల్సిందే.. దాదాపు తెలంగాణా లోని అన్ని యునివేర్సిటిల్లోని విధ్యర్తులన్దరిని అరెస్టు చేసారు,, జై తెలంగాణా అన్నా ప్రతి నాయకుణ్ణి, కార్యకర్తని అరెస్టు చేసి బొక్కలో పెట్టారు.. ఒక దశలో ప్రతి తల్లి తన కొడుక్కి వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని పంపించేలా ఉసి గోల్పాయి ఈ ప్రభుత్వపు చేష్టలు... నాకు తెలిసినా నా మిత్ర్హులు కొందరు ఇదే విషయం చెపారు.. మిల్లియన్ మార్చ్ కి వేల్లెముందర వారి తల్లి ఇంట్లో వీర తిలకం దిద్ది, జై తెలంగాణా అని చెయ్యెత్తి జై కొట్టి, మరీ పంపిందంట, ఒక వీరుడి తల్లి వలె... ఇలాంటి పరిస్తితుల్లో, అనుమతి లేదంటూ పోలీసు ఉన్నతాధికారులు అతిగా ప్రవర్తించి, ఉదయమే TG -JAC చైర్మన్ ఐన ప్రొఫ్. కొదండ్ రామ్ ని అరెస్టు చేసి ప్రజలను రెచ్చగొట్టింది ఈ ప్రభుత్వం... ఇక ఈ కార్యక్రమాన్ని ముందుంది నడిపించే దిక్కు లేకుండా చేసారు.. అయినా కూడా ఎవరు ఎలాంటి సహనం కోల్పోకుండా, కార్యక్రమాన్ని ఎవరికీ వారే ముందుకు తీసుకు వెళ్లి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులే...



ఇక ఈ కార్యక్రమంలో అనుకోకుండా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను కొంత మంది కావాలని భూతద్దంలో పెట్టి చూస్తూ మరీ, పెద్దగ చేస్తుండడం చూస్తే చాల భాదేస్తోంది.. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 6 దశాబ్దాలుగా తెలంగాణా వారికి అన్యాయం జరుగుతుంటే ఎవరికీ కూడా గుర్తుకు రాని తెలుగు వారు ఆత్మగౌరవం, ఎన్నో సంవత్సరాలుగా పోరాడి తెచుకున్న తెలంగాణా ను రాత్రికి రాత్రే అర్ధరాత్రిలో లాగేసుకున్నపుడు గుర్తుకురాని ఈ ఆత్మాభిమానం, ఏం చేయాలో తెలీని దిక్కు తోచని పరిస్థితుల్లో 600 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నపుడు గుర్తుకు రాణి ఈ గొప్పతనం, ఒట్టి మట్టి బొమ్మలను పగులగోడితే గుర్తుకువచింది ఈ తెలుగు వారికి.... ఈ దాడిని ఒక ఆంధ్ర పెత్తందారుల మీద జరిగిన దాడిగా గుర్తించాలే తప్ప, వ్యక్తుల మీద జరిగిన దాడిగా గుర్తించకూడదు... అయినా అక్కడికి వచ్చింది లక్షల మంది జనం, విధ్వంసానికి పాల్పడింది కొన్ని వందల మంది కూడా కాదు... దీనికే, ఒక TV (TV-9)ఛానల్ లో అయితే వెర్రి కూతలతో మొత్తం ఉద్యమాన్నే కించపరిచేలా వాఖ్యలు చేసింది... ఆ ఛానల్ వాడికి అసలు కళ్ళు ఉన్నాయా...?? చెవులు ఉన్నాయా....? ఉంటె ఏమయి పోయాయి... కొన్ని లక్షల మంది ఊరూరా దీక్షలు చేస్తుంటే కళ్ళు దొబ్బాయా.. చెవులు మూసుకుపోయాయా..?? అసలు ఇలాంటి వాళ్ళను ఇంకా హైదరాబాద్ లో ఉండనిస్తున్నందుకు ప్రతి తెలంగాణా వాడు మనసులో ఎంతో భాదపడుతూ ఉంటాడు... ఇలాంటి విధ్వసానికి దిగడానికి కారణం ఐన కొన్నింటిని మనం అర్ధం చేసుకోవాలి ఇక్కడ,, ముఖ్యంగా ఎంతో ప్రశాంతంగా చేయాలనుకున్న మిల్లియన్ మార్చ్ ని కావాలని పోలీసులను విచ్చలవిడిగా రప్పించి విధ్వంసభరితం చేసింది ఈ ప్రభుత్వం.. అసలు నాకో పెద్ద డౌటు ఏంటంటే, ఈ విధ్వంసాలకు పాల్పడింది మఫ్టీ లో ఉన్న పోలీసులే అని.. లేదంటే సీమంధ్ర పెత్తందారుల తొత్తులు ఎవరైనా ఉద్యమంలోకి వచ్చి అసలు ఉద్యమ కారులను ప్రేరేపించి ఐన ఉండాలి... అసలు తెలంగాణా ప్రజలే గనక ఈ విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు అని అనుకున్నా, తెలంగాణా ఉద్యమం అన్నది పిచోది చేతిలో రాయి అని కొన్ని చాన్నేల్లు అనుకున్నట్టు అయితే, ఇపటికి ఎప్పుడో ఈ పని చేసి ఉండేవారు.. ఇలా విగ్రహాలను ధ్వంసం చేయొద్దని అక్కడ ఉన్న ఎంతో మంది ప్రొఫెసర్లు, ఉద్యమ నేతలు కోరినా వారిని నెట్టేసి, ఈ పని చేసారంటే ఖచ్చితంగా ఇది ఉద్యమాన్ని నీరుగార్చాలని కొంతమంది పెత్తందారులు చెపితే చేసిన పనే... అంతే కాని ఇది ఉద్యమ కారులు చేసిన పని ఎంత మాత్రం కాదు... దీనిని ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి... తెలంగాణాకు, హైదరాబాద్ కు నది బొడ్డు ఐన ట్యాంక్ బాండ్ పై కొంత మంది తెలంగాణాకు చెందినా వారివి విగ్రహాలు పెట్టాలని తెలంగాణా ప్రజలు ఎపటినుందో కోరుతున్నారు. దేనికి సానుకూలంగా 7 ,8 నెలల క్రితం కొమురం భీమ్ విగ్రహ స్థాపనకు ప్రభుత్వం ముందుకు వచినా ఇపతివరకు దానికి సంభందించిన పనులు మొదలు కాలేదంటే ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని మనం అర్ధం చేసుకోవచు.. ఇది తెలంగాణా వారిని కావాలని చిన్న చూపు చూస్తున్నట్లుగా కాదా???? ఇదే కోపం లో, కొంత మంది ఆవేశపరులు చేసిన పనిగా కూడా మనం దీనిని అర్ధం చేసుకోవచ్చు .. అసలు ఈ విధ్వంసాలకు దారి తీసిన కారణాలను, పరిస్థితులను మనం అర్ధం చేసుకోవాలి కాని నోటికి వచ్చిందే చందం అన్నవిధంగా అనకూడదు... ఇంకా విగ్రహాల మీదనే కాదు అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకుల మీద కూడా ప్రజలు తమ కోపం చుపెట్టారంటే ఇది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని గ్రహించాలి... ప్రజల కోపం తాకిడి కెసిఆర్ ను సైతం తాకింది... KCR సెక్యూరిటీ వాహనాన్ని ధ్వంసం చేసారంటే పరిస్థితి ఎంత ఉద్విగ్నభరితంగా ఉందొ అర్ధం చేసుకోవాలి...



ఒకే ప్రాంతానికి వంత పాడే ఒక వెబ్ సైట్ లోనైతే, ఏకంగా, '' మనుషులం అన్న సంగతే మరచిపోతే, ఇక ప్రాంతాలేందుకు, రాజ్యాంగం ఎందుకు , ప్రభుత్వం ఎందుకు'' అంటూ స్టేట్మెంట్ లు .. అవును నేను కూడా అదే అంట... ఈ దాడి మనుషుల మీద జరగలేదు అన్న విషయం గుర్చుంచుకోండి... మనుషుల మీద దాడులు జరుగుతుంటే ఇలాంటి వారికి ఇవన్ని ఎందుకు గుర్తుకు రావో...??? ఇంకా మిల్లియన్ మార్చ్ ని మిలిటెంట్ మార్చ్ గా అభివర్ణించారు కొందరు మేథా(తా)వులు.... అసలు ఇంత వరకు జరిగిన తెలంగాణ ఎలా ఉందొ కూడా తెలీనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు.... పైగా తెలుగోడు తల దించుకోవాలి, రాష్ట్ర చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ అరుస్తున్నారు, అసలు ఏ రోజు కాదు బ్లాక్ డే, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టిన ఇన్ని రోజులు బ్లాక్ డే నే, దానికి సిగ్గుతో తల దించుకోవాలి అసలు సిగ్గు సారం ఎమన్నా ఉంటె...... అసలు మిలిటెంట్ ఉద్యమం ఈ సీమంధ్ర పెట్టుబడిదారులకు చుపెట్టాలనుకుంటే ఎపుడో చూపెట్టే వారు ఈ తెలంగాణా ప్రజలు.. ప్రజాస్వామ్యానికి కట్టుబడి, రాజ్యాంగ బద్దం గా చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇది.. ఇంకా కొన్ని పత్రికలైతే విధ్వంసాల మార్చ్ అంటూ విధ్వంసం సృష్టించాయి.. ఐనా లక్షల మంది వచ్చినపుడు, ముందుండి నడిపించే నాయకుణ్ణి దిగ్భందం చేసినపుడు ఏమి చేయాలో తెలీని ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజల ఓపికను అర్ధం చేసుకోవాలి... ఇదే ఘటన వేరే ఈ దేశంలో గనక జరిగితే తెలిసేది అసలు ఏమయ్యేదో... అసలు వేరే దేశం ఎందుకు వేరే రాష్ట్రంలో జరిగితే ఏం అయ్యేదో తెలిసేది ప్రభుత్వానికి...



ఇంకా కొందరు అయితే అబద్దపు పెళ్లి చేసి మరీ ట్యాంక్ బాండ్ మీదకి వచ్చారంటే ప్రజలు ఎంత బలంగా అనుకున్నారో అర్ధం చేసుకోవచ్చు... ముందే చెపిన సమయం కంటే అర గంట ముందు వరకు కూడా ఎవరు ఊహించి ఉండరు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని.. ప్రతి తెలంగాణ వ్యక్తి స్వచ్చందంగా ముందుకు వచ్చారు... మహిళలు కూడా మేము సైతం అంటూ పిల్లలతో ముందుకు వచ్చారు...ఒకే ఒక్క గంటలో ట్యాంక్ బాండ్, దాని పరిసరాలు మొత్తం మారిపోయాయి... పోద్దటినుండి పోలీసుల కవాతులతో ప్రశాంతంగా ఉన్న ట్యాంక్ బాండ్, ఒక్కసారిగా హోరెత్తిన జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది... అరగంట వ్యవధిలో బుద్దుడి సాక్షిగా ట్యాంక్ బాండ్ అంతా జనసంధ్రమయింది... పరిస్థితి పూర్తిగా పోలీసుల చేయి దాటి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లిపోయింది.. అందరి నోట ఒకటే మాట- జై తెలంగాణ అని.... ఎంతో మంది ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని దిగ్విజయం చేయడానికి పూనుకొని వచారు... తెలంగాణ జిల్లాల నుండి హైదరాబాద్ కి వచ్చేవారిని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరి ఇంత మంది ఎలా వచ్చారు, ఎకడనుండి వచాఋ అన్నది అర్ధం చేసుకోవాలి... అంతే కాదు, హైదరాబాద్ లో అసలు ఉద్యమమే లేదు అనేవారికి ఇదొక గుణపాటం కుడా... గమనించాల్సింది ఏంటంటే, ఈ మార్చ్ లో పాల్గొన్న వారు దాదాపుగా అందరూ హైదరాబాద్ లోని వారే... అంటే ఇపటికైన ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ లోని ప్రతి ఒక్కరు, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు, వారి ఆశ, శ్వాస అంతా తెలంగాణే అని... ఇంత కన్నా ఇంకేం చేయాలి ఏ తెలంగాణ ప్రజలు......???

అసలు ఈజిప్టులో ముబారక్ సైతం ప్రజల ఆకాంక్షకు తల వంచాడు, శాంతియుత ర్యాలి కి అనుమతి ఇచ్చాడు, కాని ఏ మన ప్రజాస్వామ్య దేశంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ భారతదేశంలో ఎలాంటి హక్కులు లేవు... దీనికి ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకోవాలి... ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన సమయం ఇది.... ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల మంది ప్రజలు ఒక్కటై తమ ఆత్మ గౌరవం కోసం, తమ గుర్తింపు కోసం, తమ హక్కుల కోసం గొంతెత్తి ఒకే చోట చేరడం అన్నది భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం... కానీ, ఒక్కటే అర్ధం కానీ విషయం ఏంటంటే, ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాంతానికి చెందిన 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు విలువ లేకపోవడం అన్నది మన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు...

మీ,

దీపం,

please my blog & source- nanokiran.blogspot.com


KIRAN DASARI

Million

జాతి రత్నాలు అంటున్నావ్, ఎవడి జాతి..


బొమ్మలు తగలబడితేనే నీకు చరిత్ర, సంస్కృతీ గురుతోచ్చిందా..

అసలు నీకు ‘ఆత్మ’ ‘ గౌరవం’ అంటే అర్థాలు తెలుసా..

కూలిన నీ చరిత్ర కారులని అడిగి తెలుసుకో బ్రదర్

తెలుగు జాతి తగల బడింది అని కుల్లుతున్నావ్

తెలంగాణా జాతి మాటేప్పుడైనా వినపడిందా

వారు గొప్ప వారు కావొచ్చు..

కాని నా తల్లి గుండె మీద

నిప్పులై మండుతున్నారు

ఎపుడైనా నీ ఎసి కార్లల్ల తిరుగుతుంటే

కనపడిందా మా గోస

హుస్సేన్ సాగర్ నిండా నా తల్లి కంటి నీరే కదా..

భాషని, యాసని హేళన చేసి చూసే నీకు

ఎక్కడిదిరా హక్కు

జాతి గురించి ఊసెత్తడానికి

అందమైన హైదరాబాద్ ను తయారు చేసిన

నా రాజుల చరిత్ర ఏది?

ప్రపంచ పటంల నా జాతి ని నిలబెట్టిన

నా నిజాం పరిమళాలు కలుషితం చేసి

మా కొమరం భీమ్ ధైర్యానికి , వీర చరిత్రకు మసి పూసి,

అయిలవ్వను , యాదగిరిని , బందగిని బొందపెట్టి

ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నావ్..

రాయి బద్దలయితే రాద్ధాంతం చేస్తున్నావ్,

బొమ్మ పగిలితే గుండె పగిలినట్టు

గంటలూ గంటలూ రొద పెడుతున్నావ్

నువ్వు నిలబడ్డ జాగా నాది,

నా జాగా చరిత్ర ఏది? సంస్కృతీ ఏది?

నా బిడ్డలు ఏరి..

ఓ గురజాడా, ఎర్ర ప్రగడ, ఇంకా ప్రజా కవులారా..

మీరు చేసిన తప్పంతా..

రక్త మాంసాలు తినే నర రూప రాక్షసుల చేతుల్లో పడడమే,

మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మా జాతి ని మట్టు బెట్టి,

మా చరిత్ర సమాధుల మీద మిమ్మల్ని నిలబెట్టడమే

మేము గురి పెట్టింది మిమ్మల్ని కాక పోవచ్చు,

మీరు చేసిన కృషిని కాకపోవచ్చు..

మా ఆక్రోశం బద్దలు అయింది

భాల్ల్లున పగిలింది మీ బొమ్మల పైన..

మీ జాగా ఖాళి అయితేనే కదా

మా చరిత్రలు నిలబడేది

ఒకటి అంతం అయితేనే మరొకటి మొదలు..

మా జాతి కోసం ప్రాణాలు అర్పించిన

అమర వీరుల సమాధులకు కూడ

జాగా లేదు, వారికి చోటియ్యనియండి,

బొమ్మలకి బాద పడే మీరు..

బిడ్డలు కళ్ళముందు కాలుతుంటే

ఒక్క కన్నీటి బొట్టు కూడ రాల్చ లేదే?

కవితలు రాల లేదే, పుస్తకాలు అచ్చు కాలేదే ?

మీ మాటలు కత్తుల్ల దిగుతుంటే

ముక్కలైన మా మట్టిని ,

బూడిదైన మా సంస్కృతిని

మళ్లీ నిలబెట్టుకున్దామనే

చరిత్రని మల్లా తిరగ రాస్తున్నాం,

ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు

స్తానం లేదు..అందమైన విగ్రహాలకు

విడిది కాదు నా ఇల్లు,

ఆగమైతున్న బతుకు చిత్రాలకు

కొలువు..

భుతల్లి కన్నీట మునుగుతున్నాం

గర్భ శోకంతో కుంగి పోతున్నాం..

మోసాలకు ఎత్తులకు జిత్తులకు

విసిగి వేసారి ఉన్నాం..

కొలిమిల్లాగా మండుతున్నాం..

దగ్గర కొస్తే ఆగం అయితారు..

మాట్లాడే సహనం లేదు,

బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు

మిగిలినవి చేతలు , చేతులే ..

ఆవేశం అంటుకున్నది

ఆవేదన అలుముకున్టున్నది..

మంచి చెడుల మధ్య

చెరిగిన రేఖ..

న్యాయ అన్యాయాల మధ్య నలిగిన

సత్యం..

ఇప్పటికైనా …

నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..

మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..

మీ చరిత్రనూ నిలబెడతాం..

మా చేతుల మీదుగా

మేము ప్రశాంతంగా

స్వేచ్చగా గాలి పిలచిన రోజు

జై తెలంగాణ ------ జై జై తెలంగాణ

నా తెలంగాణ




అర్ధ శతాబ్దపు ఆగడాలకు బలియై పోయెను ఈ రాజ్యం



ఆత్మగౌరవం అన్న పేరుతో అవతరించిన ఆంధ్ర రాష్ట్రపు -



ఉక్కుకౌగిలికి కమిలి క్రుశించెను ఈ దేశం



భాష మాత్రమే ఏకమన్నది అందరెరిగిన సత్య వచనము



భావజాలపు బానిసత్వముకు కృంగి పోయెను ఈ ప్రాంతం



వన్నె తగ్గని సిరులు ఉన్నను వట్టిదైనది నా స్థానం



పుటములెరుగని చరిత ఉన్నది - పుట్టి మునిగిన గతము ఉన్నది



రక్తపు మడుగుల జాడలున్నవి - రాచరికపు గాధలున్నవి



శాతవాహనుల ఖ్యాతి ఉన్నది...కాకతీయుల ఖిలాలున్నవి



రామగుండపు వెలుగు ఉన్నది....బొగ్గుగనుల బహుమణులు ఉన్నది



సున్నపు రాయి గనులు ఉన్నది...రాతి పలకల నిలువలున్నది



జీవ నదుల ఆ సవ్వడున్నది - వాగు వంకలు బహు మెండుగున్నది



వనరులున్నను వనములున్నను వ్యర్థ బానిస బ్రతుకు అయినది



నక్సలిజం అను కుంటిసాకుతొ దగాపడ్డ ఈ ధరిత్రి నాది



కర్మాగారం, కార్మికగానం కలగలిసినది ఈ నేల



ధార్మిక స్థానం దైవిక క్షేత్రమై ఉద్ధరిల్లినది ఈ భూమి



తర తమ భేదాలెన్నో మరిచి మెలిగి వెలిగినది ఈ క్షేత్రం



రాజకీయ చదరంగానికి - పోరాటాల రణరంగానికి పావులై -రాటుతేలినది ఈ నా జనం!

తెలంగాణ సాధనకై కలిసి కదలినది కదం దాన్ని ఆపుట కాదు ఇంకెవ్వరి తరం !!



జై తెలంగాణ ------ జై జై తెలంగాణ
నా ప్రశ్న ??????




జనాల కోసం వేచే జగతిన జాగృతి ఉంటుందా?



వనాల తిరిగే జాతికి ఇలలో విలాసముంటుందా?



సమగ్రతంటే తెలియని వారిలొ సమైక్యతుంటుందా?



స్వతంత్ర్య దేశపు పౌరుల బ్రతుకున సుశాంతి ఉంటుందా ?



అభాగ్య జీవుల కలిలొ నిలిచే విషాద భారతమా



శ్రామిక జీవుల శక్తిని దోచే దగాల భారతమా



కర్షక జీవుల స్వేదం పీల్చే దళారి భారతమా



దొరలుగ పిలిచే దొంగలు ఉన్న దరిద్ర భారతమా



దోపిడికారుల మదిలో మెదిలే విలాస భారతమా



ప్రజానీకమే రాజ్యమేలునను ప్రజస్వామ్యమిదిరా



విధానమంటూ నిజాన్ని దాచే అ-ప్రజస్వామ్యమిదిరా !





మతాల పేరున మంటలు రేపిన నాయకుడంటారా?



మనుగడ కోసం పోరే వాడిని “మావో “అంటారా?



మట్టిని, పుట్టను, చెట్టును సైతం మలినం చేస్తారా?



సెజ్ (SEZ) ల పేరిట అడవులు కూడ కననం చేస్తారా?



అడిగిన వారిని అన్నలు అంటు తన్నుతు(చంపుతు) ఉంటారా?





పెన్నును గన్నుగ మార్చే కవినని నన్నేమంటావో?



కవితగ వచ్చిన పదమును కూడ నక్సల్ అంటావో?



తెలిసే చేసిన తప్పుకు నువ్వు తపించి పొతావో



తెలియక చేసిన ఒప్పనుకొని నువు తరించిపొతావొ



(విసిగి) వేచిన పౌరుల మదిలొ నిలిచే వికృత అగత్యమా?



జవాబు తెలిపే బాధ్యత ఉన్న జనాల ప్రభుత్వమా ---------!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

జవాబు తెలిపే బాధ్యత ఉన్న జనాల ప్రభుత్వమా ---------!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

నాడు 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నాడొక మహానుభావుడు. కాని నేడు 'రాష్ట్రమంటే రాతిబొమ్మలేనోయ్ రాలిపోయే ప్రాణులు కాదోయ్!' అని అంటున్నారు


వన్నెతగ్గని కుహనా ప్రజాస్వామిక, సాంస్కృతిక-సాహిత్య దురంధరులు. కూలిన విగ్రహాల గురించి నిరసనలు, నివాళులు, లెంపలేసుకోవడం మరియు పాలాభిషేకాలు చేసి కన్నీరు పెట్టుకోవడం కడు శోచనీయం. వారి దూషణలు మిక్కిలి గర్హనీయం. ఐదున్నర దశాబ్దాల దోపిడి, ఆరాచక మరియు నియంతృత్వపు వలసవాద పాలన నుండి విముక్తికై పోరాడుతూ,

తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి మంటల్లో కాలి బూడిదవుతున్న ఆ త్యాగ మూర్తుల కంటే తమది కాని అన్య మూర్తుల ప్రాముఖ్యత సమయానికందిరాని ఆలోచన. పాలకుల తుపాకుల నుండి వర్షించే తూటాలు, ఇనుప బూట్ల తొక్కుల్లు మరియు లాఠీల విలయతాండవంతో నెత్తురోడి నేల రాలిన ఆ భావి కుసుమాల గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చి సానుభూతి తెలిపే, మానవత్వం మూర్తిభవించిన సాటి తెలుగువారలె లేకపోయిరి కదా! అణచివేతలతో, ఆధిపత్యపు ఆగడాలతో దెబ్బ తిన్న జీవుల కళ్ళలోంచి నీళ్ళకు బదులు

నిప్పులు, హృదయంలోంచి ప్రేమకు బదులు ద్వేషం పుడుతుందనే నగ్న సత్యం విజ్ఞులకు తెలియంది కాదు. దాని పర్యావసనమే ట్యాంక్ బండ్ ఘటనలు. ఇది గ్రహించక పుండు మీద కారం జల్లినట్లు ' అమానవీయమని, తెలుగు వారు తలదించు కోవాలని, దున్న పోతులూ సిగ్గు పడతాయని, చరిత్ర క్షమించదని, దోషులను ఉరి తీయాలని ఎన్నెన్నో సూక్తులు వినిపించారు కుహనా సంగీత-సాహిత్య-సాంస్కృతిక సామ్రాట్లు. మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తంగా చాటి చెప్పి అందుకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు కీ.శే. నందమూరి తారక రామారావు మీద చెప్పులు విసిరి అవమానం చేసిన నాడు ఈ తెలుగు జాతి ఎక్కడ విశ్రాంతి తీసుకుందో? ఆ దోషులను శిక్షించక పోగా నిసిగ్గుగా ఓట్లు వేసి రాజ్యాధికారాన్ని అప్పగించిన ఘనత మీకే చెల్లింది కాబోలు. చివరకు ఏ ఆదరణకు నోచుకోక కృశించి దిక్కులేని చావు చచ్చిన మాట వాస్తవం కాదా? ఇక మరో తెలుగు ముద్దు బిడ్డ కీ.శే. పి.వి. నరసింహారావు గారి మీద కర్నూల్ లో చెప్పులు విసిరి తమ తెలుగు సంస్కృతీ అభిమానాన్ని దశ దిశల చాటిన ఆ ఘనత మీకే సొంతం. అట్టి కార్యక్రమ వ్యూహ కర్తలకు శాపనార్థాలు, శిక్షలు ఉండకపోగా మంత్రులు-ముఖ్యమంత్రులను చేసి ఆనందపడిన చరిత్ర మీకు మాత్రమే వున్నది. ఇంతగా గొంతు చించుకుని, గుండెలు బాదుకునేవారు ఈ మధ్య బరంపురంలో జరిగిన తెలుగు మహాసభలో తెలంగాణ కవి నందిని సిద్దా రెడ్డి మీద భౌతిక దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? ప్రసార సాధనాలు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు?. అతను సిమాంధ్ర రాతిబొమ్మ పాటి విలువ చేయరు కాబోలు. ఇగ త్రివర్ణ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య చరిత్ర తిరగవేస్తే మరీ దుర్భరం. ఆ దేశబక్తుడి ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కడు పేదరికంతో కనుమూశాడు. అప్పుడు ఏలిన వారికిగాని, అనామకులను, అవినీతిపరులను ఆదుకుని సత్కరించే తెలుగు సంస్థలు గాని, సంఘాన్ని ఉద్దరించే ఆపన్న హస్తాలు ఎక్కడికి అదృశ్యం ఆయ్యాయో తెలియదు. మరో దారుణం ఏమిటంటే పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం ఎందుకు చంపబడ్డాడు? ఎవరు చంపారు? దోషులు ఎలా మాయమయ్యిండ్రు? దీనిపైన ఈ తెలుగు జాతి గళం విప్పలేదెందుకు? ధర్నాలు, పోరాటాలు చెయ్యలేదేందుకు?

పాదిరికుప్పం, కారంచేడు మరియు చుండూరు హత్యలు గుర్రం జాషువా గౌరవార్థం జరిగినవేనా? ఈ కుహనా ప్రజాస్వామిక వాదులు, సాహితీ వేత్తలు తమ నిసిగ్గు ద్వంద ప్రమాణాలు ఇక నైనా మానడం

మంచిది. అంతెందుకు ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే సీమాంధ్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎన్ని ద్వంశం అయ్యయో చెప్పక్కర్లేదు మరి పెకిలిన గొంతులెన్ని? ఖండించిన ప్రజాసంఘాలేన్ని? ప్రశ్నించిన మానవతావాదులేరి?.ఆగడం చేస్తే జగడం ఆగదు సరికదా ఇంకా ఉదృతం అవుతుంది. పది సంవత్సరాల పసి బాలుడి నుండి పండు ముదుసలికి తప్పని బైన్దోవర్లు, కాలికి చెప్పులు లేకుండా రచ్చబండకు రమ్మనడం లేదంటే ఊర్ల దిగ్బంధనం, ఇండ్లు,బండ్లు,గొడ్డు గోదను తగులబెట్టడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సోదరభావం? చావడానికి యావత్ తెలంగాణ సిద్దం అయ్యింది గాని భాష పేరుతో

బానిసత్వానికి, కులంపేరుతో కుటిల రాజకీయానికి

ఏ మాత్రం సహకరించడానికి సంసిద్దులుగాలేరనే నగ్న సత్యాన్ని వలస

పాలకులు గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రజల కోపాగ్నికి

ఆహుతి గాక తప్పదు.నియంతల చరిత్రనుండి నిజాలు తెలుసుకుని

హుందాగా నిష్క్రమించడం ఉత్తముల లక్షణం.



"భక్తుడి కోపానికి భగవంతుడికే భంగపాటు తప్పలేదన్న సత్యం జగత్వ్యాపితం".



జై తెలంగాణా - జై భోలో తెలంగాణా!

జై తెలంగాణ జైజై కెసిఆర్

Santosh Kumar10:27pm Mar 18




నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వారధి

తెలంగాణ ఉద్యమ రధసారధి

తెలంగాణ పోరు సైన్యాది

చంద్రశేకార (KCR) నికివే

మా తెలంగాణ ఉద్యమబివంధానాలు

తనువెల్ల గాయాలతో తల్లడిల్లుతున్న

తల్లి తెలంగాణకు తోడుగా నేనున్నానంటూ

తోలిఅడుగులోనే జనవిహర్ లో

జనంతో జాడివాన సృష్టించితెలంగాణ తెగువను తెలిపావు



ఉభిలోకిపోతున్న ఉద్యమానికి

కరీంనగర్ ఉపపోరుతో ఉవ్వేత్తునలేపి

ఆగిన తెలంగాణ పౌర్శన్ని ఆకాశానికంట్టచేసావు

పక్షపాత రాజకీయాల పడుపనులతో

ప్రాణాలుపోతున్నతెలంగానంకు

తెగతెంపుల సందర్బం

తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అంటూ

నీ ప్రాణాలు పనంగాపెట్టి

పది రోజులలో ప్రతేక్య రాష్ట్రము

ప్రకటన తెప్పించావు



ఆంధ్రవాద పార్టీలన్నీ అగమేగాలమిధ ఏకమైన

నీన్ను ఆపలేవు

నువ్వు తెచ్చే తెలంగాణాను అడ్డుకోలేవు

నీ అడుగడుగునా తెలంగానం

నీ అణువణువునా తెలంగానం

నీవే ఓ ప్రభంజనం

నీ తోనే తెలంగాణ జనం

అందుకే నివు మాప్రాణం

తెలంగాణే ని ఆర్తి

తెలంగాణ చరిత్రలో సుస్థిరం ని కీర్తి



జై తెలంగాణ జైజై కెసిఆర్

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా


———————————————-



కలికాల కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా

మరుగుతున్నది చూడుమా … రాష్ట్రం నేడు మలిదశ ప్రత్యేక ఉద్యమాన

మాట ఇస్తివి మడమ తిప్పకుమా …మత్తు వదిలి మార్గం చూపుమా



ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యమని తలిస్తివి

పార్లమెంటున ప్రకటన చేస్తివి

ఎవరి సొమ్ము తిని గమ్మున ఉంటివి

ఏ వ్యూహం పన్ని మౌనం వహిస్తివి ??



నీ మౌనం మారణాయుధమై మరణ శాసనం లిఖిస్తుంటే

మండిన గుండెలు సహనం చచ్చి సజీవ దహనం అవుతుంటే

నీ మనసు గెలుసునవి బహుమతులే గనుక అయితే ….

కాలిన కళేబరాలే కానుకలుగా ఇద్దుము

కాలయాపన చేయక కళ్ళు తెరువుమా ..

కుంభకర్ణ అవతారమా .. ఓ కేంద్ర ప్రభుత్వమా !!



ఇల్లు గుల్లై ఒళ్ళు కాల్చుకుంటుంటే

ఓట్ల కోసం పొత్తుల ఎత్తుల ఆటలడుతున్నావ్

మలిన రాజకీయ ‘విలీన’ షరతులు విధిస్తూ

విద్యార్థి భవితను వీధి పాలు చేస్తున్నావ్

ఇది వికృత చేష్టల పరాకాష్ట కాదా … ప్రజా ఆకాంక్షలకు పాతర కాదా ??



ప్రజా ఆవేదన అరణ్య రోదన అవుతుంటే

ప్రజాస్వామ్యం పరిహాస మవుతుంటే

ప్రభుత్వమే జడత్వం మై ..పాలకులే ప్రేక్షకులై

పరిష్కారం తెలుపకుంటే ….



ఉద్యమాలే ఉరితాడులై నీ ఊపిరి తీసును తెలుసుకోనుమా …

మేలుకొని రాష్ట్రమిచ్చి మా మదిని ఏలుకొనుమా..

కుంభకర్ణ అవతారమా … ఓ కేంద్ర ప్రభుత్వమా !!



—- సుధీంద్ర భార్గవ