Showing posts with label Telangana News. Show all posts
Showing posts with label Telangana News. Show all posts

Thursday, September 23, 2010

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

కేసీఆర్ వ్యాఖ్యలతో ఉద్యమానికి నష్టమే !: తెలంగాణ జేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 : స్థానికతపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉద్యమానికి నష్టమేనని తెలంగాణ జేఏసీ భావిస్తోంది. మంగళవారం ఇక్కడ తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జేఏసీ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు..ఏ దశలోనూ కేసీఆర్ వ్యాఖ్యలను అంగీకరించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..తెలంగాణ ఉద్యమానికే కాకుండా, ఇక్కడి ప్రజలకు కేసీఆర్ వ్యాఖ్యల వల్ల నష్టం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనకు తెలియజెప్పాలని నిర్ణయించారు.

ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు పూర్తి సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఉద్యమకారుల మనసు నొప్పించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. స్థానికులు ఎవరు ? స్థానికేతరులు ఎవరు ? అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని అభిప్రాయపడ్డారు. ముల్కీ నిబంధనల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలు తరహా పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో తెలంగాణ వాదులు పరస్పరం విమర్శలకు దిగవద్దని భావించారు.

ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై వేధింపులను ప్రభుత్వం ఆపకపోతే క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ నేత వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అందిన బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ సీఎం రోశయ్యను కలవాలని, అయినప్పటికీ ప్రయోజనం లేకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇవ్వనున్న నివేదికపై (అనుకూలమైనా..వ్యతిరేకమైనా) తెలంగాణ జేఏసీకి ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలని నిర్ణయించారు.

దీనిపై వీలైనంత త్వరగా కసరత్తు చేపట్టాలనుకున్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ జరిగిన ఈ సమావేశానికి టీఆర్ఎస్‌సహా బీజేపీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. జేఏసీ భాగస్వామిగా మూడు రాజకీయ పార్టీలుంటే..ఒక్క న్యూడెమోక్రసీ నుంచి కె.గోవర్థన్ హాజరయ్యారు. ఇతర భాగస్వామ్య ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు-ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు

2011 తెలంగాణా వస్తుందనుకుంటే పగటికలే అంటున్న బాబు
ఆలూ లేదు, చూలూ లేదని సామెత గుర్తు చేసిన బాబు
ప్రజాస్వామ్యంలో ఏమీ లేకుండా కలలు కనొద్దని హితవు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణా 2011లో వస్తుందనుకుంటే అది పగటికల మాత్రమే అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏమీ లేకుండా కలలు కనడం కరెక్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు ఏదో పెట్టారన్నట్టు అని బాబు సామెతను గుర్తు చేస్తూ, బుధవారంనాడు కె.సి.ఆర్. హైదరాబాద్‌లో కార్పొరేట్ సంస్థల సి.ఇ.ఓ.ల సమావేశంలో ఇచ్చిన హామీని బాబు తేలికగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంద ంటూ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఢోకా లేదని కూడా ఈ సందర్భంగా కె.సి.ఆర్. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వుయ్ ఆర్ ఇన్ డెమొక్రసీ, ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది మాట్లాడడానికి లేదు, ప్రతిదానికీ ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉన్నాయని బాబు వ్యాఖ్యానించారు. పద్ధతులను పట్టించుకోకుండా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే కుదరదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం ఉంటే వారే అభివృద్ధి చేస్తారు గాని ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఆయన అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణాలోని అనేక ప్రాంతాలలో తెలంగాణావాదులు రాస్తా రోకో చేశారు. అనేక చోట్ల బాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

Sunday, September 19, 2010

ఎకరాకు 60 బస్తాలు

ఎకరాకు 60 బస్తాలు
'శ్రీ' సాగుతో సాధించిన సుగుణమ్మ
అమెరికాకు పాకిన ప్రతిభ
తమ దేశానికి రావాలని ఆహ్వానం
సన్మానించిన పొన్నాల, రఘువీరా
హైదరాబాద్, సెప్టెంబర్్ 8 : ఎకరా పొలంలో ఎన్ని బస్తాల వరి పండించొచ్చు? అత్యాధునిక పద్ధతులు, సంరక్షణ విధానాలు అవలంబిస్తే ఏ మాత్రం దిగుబడి రాచొచ్చు? 20..25..బాగా పండితే 30 బస్తాలు. కానీ అంతకు రెట్టింపు పంటను కూడా సాధ్యం చేసి చూపారు ఓరుగల్లుకు చెందిన ఓ మహిళా రైతు. అంతేకాదు ఈ విషయాన్ని తెలుసుకొని అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. తమ దేశానికి వచ్చి రైతులకు ఆ రహస్యమేమిటో చెప్పాలని ఆహ్వానం పంపింది.

వరంగల్ జిల్లా జనగాంలోని కట్కూరు గ్రామానికి చెందిన సుగుణమ్మకు కనీసం సొంతభూమి కూడా లేదు. రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని మూడేళ్ల నుంచి శ్రీ పద్ధతిలో వరిని పండిస్తున్నారు. ఎకరాకు 60 బస్తాలకు పైగా దిగుబడిని సాధించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమెరికా ప్రభుత్వం తమ దేశానికి రావాలని ఆహ్వానం పంపింది. తమ రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ త్వరలో ఆమెను అమెరికా తీసుకెళ్లనుంది.

ఈ నేపథ్యంలో సుగుణమ్మ బుధవారం సచివాలయానికి వచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డిని ఆమె కలిశారు. శ్రీసాగు విధానాన్ని వివరించారు. 'క్రాప్స్' స్వచ్ఛంద సంస్థ, ఇక్రిశాట్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతోనే తాను 'శ్రీ' పద్ధతిలో విజయం సాధించానని సుగుణమ్మ వెల్లడించారు.

ఆమె స్ఫూర్తి రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులకు ఆదర్శం కావాలని మంత్రులు కొనియాడారు. ఈ సందర్భంగా వారు సుగుణమ్మను శాలువా కప్పి సత్కరించారు. తన సొంత గ్రామానికి చెందిన సుగుణమ్మకు వ్యక్తిగతంగా రూ.50 వేల నగదును ఇస్తున్నట్లు పొన్నాల ప్రకటించారు

Saturday, August 7, 2010

కోల్పోయిన నిమిషం -అల్లం నారాయణ part-1

కోల్పోయిన నిమిషం
-అల్లం నారాయణ
తెలంగాణ ఉద్యమం విషయంలో ఏదో నిరాశ.. బాధ. ఏమేమో జరుగుతున్నాయి. ప్రజాపథం ఎక్కడో గానీ.. ఎవరూ అడ్డుకుంటలేరు. వందరోజులు ఉపాసమున్న గ్రామాలు కూడా వ్యతిరేకిస్తలేవు. మీటింగ్‌ల మీద మీటింగ్ లు.. ఎవరి జాక్‌ల బలుపు వారు చూయించుకునే పని. అంతం లేని పోరాటం. - ఇదొక ఫ్రెండ్ మెసేజ్

హిందూ ధర్మయుద్ధాన్ని స్మరింపజేస్తూ.. గద, ధనుస్సు, ఖడ్గము చేబూనిన వారు తెలంగాణ ఉద్యమము కారణంగా భీతిల్లిన సెట్లర్లను కలవడానికి.. ధైర్యం చేసెదరు. వాళ్లూ ఇక్కడి పౌరులేనని నచ్చజెప్పెదరు. ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారి తండ్రి శ్రీవెంకటాచారి ఈ యాత్రకు ముందు నిలిచెదరు. -మానవతారాయ్ లాంటి విద్యార్థి నాయకులు తల పెట్టిన ఒక యాత్ర గురించి ఇదొక మిత్రుని ఈమెయిల్.

ఈ మెయిల్ ఇంకా కొనసాగింది. ఆత్మహత్యలు, సెట్లర్లు, సహ జీవనం, ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరొక్కసారి మరో ఉప ఎన్నికల యుద్ధం స్థాయికి కుదించినాక.. సంబరపడ్తున్న సెట్లర్లు చేసే అవమానాలు మరో కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పుతాయా? ఇప్పుడిక సూటిగా.. స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగవలసి న సమయం రాలేదా? మనమెక్కడికి పోతున్నాం.. దీన్నిట్లా ఎన్నాళ్లు సాగనిద్దాం. ఈఉన్మాదాన్ని దయచేసి ప్రశ్నించండి. - ఇదే మెయిల్‌లో ఆ మిత్రుని ఆవేదన.

అక్షరాలతో ఆడుకునే వృత్తిలో ఉన్న నాకు.. నిజానికి మెయిల్స్ అన్నా.. మెసేజ్‌లన్నా ఒకింత చిరాకు. పరాయి. మమేకం కాలేను. ఈ కాలంతో ఉంటున్నా.. ఈ గాడ్జెట్స్ విషయంలో అవి సరఫరా చేసే సమాచారం విషయంలో నా పరిమితులు నావి. కానీ.. ఈమెయిలూ.. మెసేజూ.. నన్ను కుదిపి కదిపి ఇబ్బంది పెడుతున్నాయి. మనసంత మానేరవుతున్నది. కొన్నాళ్లుగా తెలంగాణ చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. జీవితమే తెలంగాణ అనుకున్న వాళ్ల కు, తెలంగాణ తప్ప మరి దారిలేదని.. తెలంగాణ పిచ్చోళ్లు అనిపించుకున్న వాళ్లకు.. జీర్ణం కాని పరిణామాలు.

ఎక్కడికి వెడ్తున్నాం.. మనం. "దుఃఖపు కోటల్లో తమ్ము తాము ఎలా బద్దలు కొట్టుకోవాలో తెలియక విషాద వాకిళ్లలో నిస్త్రాణం గా పడి ఉన్న'' (దాకరపు బాబూరావు కవిత్వం) అమాయక తల్లిదండ్రులకు ఈ నిమిషాన ఎవరు సమాధానం చెప్పుకోవాలి? ఎవరు ఈ పరిస్థితులకు బాధ్యులు? ఆత్మహత్యలో.. బలిదానాలో.. ఎంత ఆవహించిన ఉద్యమ పరిస్థితుల్లో జరుగుతాయో.. అంత దిగజారిన పరిస్థితుల్లో చప్పున చల్లారిపోవడం మీద కలిగే బెంగను కొలువగలిగిన కొలమానమేది? ఉద్యమం ఎక్కడ ఉద్వేగాలని అధిగమించిందో.. ఎక్కడ జనం మనసులను మీటి మేల్కొలిపిందో.. అక్కడే కుట్రలూ ప్రారంభమయ్యాయి.

ఎగిసిపడిన మాటల నాల్కల కొసలు తాకినవారి ఆత్మహత్యలు.. ఇప్పుడవి కేవలం స్మృతి గీతికలేనా?మున్నూటా డెబ్బైమందికి తోడు ..మరో మూడు వందల బలిదానాల అనంతరం చివరికి మిగిలేదేమిటి? మిత్రుడి మెయిల్‌లో ఉద్యమం చివరకు మరో ఉప ఎన్నికల యుద్ధంగా పరిణమించడంపై అంగలార్పు ఉంటే.. ఫ్రెండ్ మెసేజ్‌లో నూరురోజులు ఉపాసమున్న గ్రామాలు సైతం ఉద్యమమార్గాన్ని కొనసాగించకపోవడంపై వేదన ఉంది. జాక్‌లు ఎవరి బలుపు వారు నిరూపించుకునే పలుకుబడి ప్రేరేపిత, అహంప్రేరేపిత, స్వీయప్రయోజన, సంకుచిత వేదికలయినాయన్న తండ్లాట ఉంది.

"తల్లిదండ్రులు పిల్లల ప్రాణతర్పణ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బలవంతపు కరపత్రాలు పంచుతూ''ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న చలనచిత్రం అన్న కవి అంగలార్పూ నల్లని విషాదంలో గూడు కట్టుకున్నట్టే ఉంది. ఎవరి మరణాలివి.. ఎవరి మరణాలివి.. అని సమూహంలో గుమికూడిన అందరు, అన్ని రకాల తెలంగాణవాదులను శవాలు ప్రశ్నిస్తున్న ఒక సందర్భమూ రానే వచ్చింది. ఉద్యమం ఎగిసిపడినప్పటి ఐక్యత, ఏకాత్మ కళ్లముందే నిలువు నిలువునా కరుగుతున్నప్పుడు దిగ్భ్రాంతి పడి చూస్తున్న నిఖార్సయిన ఒక తెలంగాణవాది ఆత్మఘోష ఉంది

కోల్పోయిన నిమిషం -అల్లం నారాయణ part-2

ఎందుకిలా మిగిలేం.. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నలు ఈ సందర్భాన తప్పేమీ కాబోదు. ఉప ఎన్నికల్లోనే కాదు.. చివరికి నాలుగు నెలలు జ్వలించిన గ్రామాలు.. బతుకమ్మలాడిన నాలుగు పానాదులు. బోనమెత్తిన తల్లి.. ధూమ్‌ధామైన పాటగాడు.. ఒక సంరంభం. ఒక కోలాహ లం. ఒక జాతర.. దిగ్గున మేల్కాంచిన తెలంగాణ యాతర. లాఠీలు, బుల్లెట్లు తిన్న యూనివర్సిటీలు. గర్జించిన విద్యార్థులు.. వాళ్లు విస్మృత చరిత్రను.. ఈ కపట కాలంలోనూ.. విస్మృత పోరాట రూపాలను కాగడాల్లా వెలిగించారు. స్వయంప్రకాశిత దివిటీలై.. యువకులు, విద్యార్థులు తెలంగాణను జ్వలింపజేశారు.

తెలంగాణ ప్రజలు మరొక్కసారి చరిత్ర నిండా పరుచుకున్న త్యాగాల పరంపర వెల్లువలా.. పడి లేచిన తరంగంలా నిలిచారు. అలలలలుగా కదిలారు. వాళ్లు గొప్పవాళ్లు. చరిత్రకు ఎదురేగి నిలబడ్డ ఊరేగింపుల సమూహం తెలంగాణ. పాతకథే. నేతలు నిస్సిగ్గుగా బాంచెలయ్యారు. ఎవరి కలుగుల్లో వారు ఎలుకల్లా దూరారు. ఎవ రి బానిస శరీరాల్లోకి మరోసారి వారే దూరారు. పుట్టు బానిసలు. మరో మోసం. మరో దగా. హీన చరిత్ర పునరావృతం. చివరికి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ సందులో.. ఢిల్లీ శ్రీకృష్ణ కమిటీ కార్యాలయం వరండాలో తాకట్టుపడింది తెలంగాణ.

లెక్క లు.. పత్రాలు.. విజ్ఞాపనలు.. విన్నపాలు వేనవేల కవిలికట్టె ల మందలో ఇరుక్కున్న తెలంగాణ ఆత్మఘోష. సరే.. రాజకీయ నేతల తోలు మందం. మరి ఉద్యమం ఏమయినట్టు? తెలంగాణకు ఒక విశ్వాసాన్నిచ్చిన సబ్బండ వర్ణాల సమ్మేళనాలు.. చరిత్ర కలిగిన ఉద్ధండపిండాలయిన ఉద్యమకారులు ఏమవుతున్నట్టు. రాజకీయం నిస్సిగ్గుగా తెలంగాణను మరోసారి బలివితర్ది మీద నిలబెట్టి ఉండవచ్చు. బానిసకొక బానిసకొక బానిసలయిన వారు.. మళ్లీ రాజకీయ ప్రయోజనాల, ప్రలోభాల, పటాటోపాలలోకి దిగజారి ఉండవచ్చు.

కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండే ఉద్యమ జాక్‌లెందుకు? ఇన్ని రకాలు గా, ఇన్ని విధాలుగా.. చీలికలుగా.. పేలికలుగా.. ఎవరు చెబుతారు సమాధానం? తెలంగాణ సాధక సమస్యలో సిద్ధాంత విభేదాలు ఏవీ లేవు. అది భౌగోళికమా? సామాజికమా? ప్రజాస్వామికమా? ఏ తెలంగాణ కావాలి.. పురాచర్చ. ఫుజూ ల్ చర్చ. ఏదో ఒక తెలంగాణ.. ముందు మాకు తెలంగాణ కావాలని అంగీకరించినవాళ్లే.. ఎజెండాలు లేవు. జెండాలు లేవు. ఒకే ఒక్క తెలంగాణ అని అంగీకరించిన వాళ్లే ఎందుకిలా ఎవరికి వారుగా తయారయ్యారు.

జాక్‌లను సమన్వయ పరిచే జాక్‌ల సమన్వయ సమితులు మరిన్ని ఎందుకు పుట్టాయి. ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు. అందరికీ తెలంగాణ కావాలి. కానీ.. 'జాక్' వేరుగా ఉండాలి.. అందరి కీ తెలంగాణే కావాలి.. కానీ ఆయన మాటే చెల్లాలి.. అందరి కీ తెలంగాణ కావాలి.. కానీ ఆయనే సమ్వయకర్త కావాలి.. గొట్టాల ముందర ప్రగల్భాలు పలుకుతున్న నోళ్లు. మైకులు బద్ధలు కొడ్తున్న వాగ్ధాటి. ఎవరి గుండంలో వారే దుంకుతున్న.. గుడుగుడు గుంచం.. ఎందుకిలా?

కోల్పోయిన నిమిషం ,అల్లం నారాయణ part-3

విద్యార్థులూ చీలారు. జాక్‌లూ చీలి మళ్లీ నిర్మితమయ్యా యి. ఊరు బతికే ఉంది. ఉపాసం ఉంటూనే ఉంది. పల్లె బతికే ఉంది. అది తెలంగాణ పదం పాడుతూనే ఉంది. చిరంజీవి... తెలంగాణ వస్తే మావోయిస్టులు రాజ్యానికి వస్తారని భయపెట్టి తెలంగాణను అవమానిస్తూనే ఉన్నాడు. కొత్తగా కామ్రేడ్ రాఘవులు తెలంగాణ వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని మార్క్సిస్టు-లెనినిస్టు సరికొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు. కమ్యూనిస్టు పోరాట యోధులను చాకలి ఐలమ్మ, బందగీ, దొడ్డి కొమురయ్యల స్మృతినీ అవమానించాడు.

ఒకరు తెలంగాణలో నూటికి 80 శాతం మంది సమైక్యాంధ్ర కోరుతున్నారంటారు. మరొకరు తెలంగాణ సస్యశ్యామల అన్నపూర్ణ అంటారు. మిత్రుని మెయిల్ సూచించినట్టే అవమానాల భారం అవని అంత పెరుగుతున్నది. కానీ 'జాక్'లు ఎందుకు చీలాయో? ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మిగిలే ఉంది. తీహార్ జైలు నుంచి ఈ మధ్య కోబాడ్ గాంధీ ఆయన సహచరురాలు అనూరాధ గురించి రాస్తూ అధికారం-ఒక చిన్న అధికారం కూడా అవినీతికి, పతనానికి దారి తీస్తున్న చోట, అహం, స్వప్రయోజనా లు, నాయకత్వం, పేరు ప్రతిష్టల కోసం ఆరాట పడుతూ ఉద్యమాలను నీరుకారుస్తున్న చోట అనూరాధ ఈ చెద అంటకుండా బతికారని కీర్తించారు.

ఈ తెలంగాణ ఉద్యమానికీ అదే చెద .....ఈ కపట కాలపు అగడ్తలయిన వ్యక్తి కేంద్రక బలహీనతలను అధిగమించకుండా తెలంగాణ ఉద్యమకారులు.. ఇక్కడి ప్రజలకు నాయకత్వం వహించలేరు. తెలంగాణ ప్రజ లు గొప్పవాళ్లు... వాళ్లకు నాయకత్వం వహించే వాళ్లే........ఈ ఖాళీని చరిత్ర పూరిస్తుంది.

Tuesday, February 23, 2010

Telugu Media is Against Telangana

Dear Telanganites,

It is a known fact that major group of Telugu media is against Telangana

agitation. Mainly TV9, which projects itself as a social champion, is being
exposed as the big culprit in this part. Anybody who is watching TV9 can
easily make out from the way the Telangana agitation is being projected and aired in its telecast. Though it tries to give an impression now and then that it is impartial, it is in fact playing a destructive role in maligning Telangana agitation. Most of us compromise and continue to accept what this channel telecasts, because we feel we do not have proper support in the media and as we do not want to develop friction with the media. But how long can we continue doing this and it is the need of the hour that we boycott this T V for many reasons. Boycott, in the sense doesn't mean that we should not view this TV , but we should raise our voice against its programmes, its presentation and its comments through anchors like Ravi Prakash and Rajnikanth. We should immediately call the channel and express our displeasure against any news which is being shown on TV9 against Telangana, not to spare live shows at all. Callers should target TV9 anchor first rather than the leader who is sitting in the studio and being interviewed. Custodian should always be impartial, not just pretend to be impartial.

1. Why did TV9 telecast the Ads which are against Telangana struggle, if

not for the sake of just money, doesn't this channel has any ethics and morals,
while they project themselves as the social champions-

2. Don't this channel care about the 60 years struggle of Telangana, except for continuing as a mouth piece of Andhra lobby-
3. Should reveal how much TV9 was funded by Raj Gopal for telecasting his news and projecting him as a big leader, is this a continuous affair or
occasional
4. Pity TV9 for bringing in leaders like Laxmi Parvati, unidentified and
baseless persons like Venkateshwar Rao of so called Hyderabad bachao
organisation and projecting them as leaders for News Watch programmes and
analysis. What is the interest of TV9 in these kind of acts, is it again the
same equation played with Raj Gopal-
5. Hail TRS leader Jagadishwar Rao for his live comments against TV9 and Rajnikanth for bringing in people from unidentified organisations, more should follow this line.
6. Should we not condemn the over smart comments from Rajnikanth through his tactical presentations.
7. Why not we target TV9 for its telecasts in support of Andhra and hatred
towards to Telangana parties and leaders-
8. How long do we need to wait for our own channel, will it become true in the near future or should we wait longer--
9. Who asked TV9 to hire helicopters to fly over the entire Hyderabad,
except for their interest in spying the students movements and passing on the news to Police instantaneously-
10. Every Telenganite should counter the systamatic and tactical approach of these channels backed up by Rajgopal and Co and save our movement

Monday, February 22, 2010

Call central Leaders to start explore about the Telangan Issue

Call Central leaders Please call/email/fax central leaders to expedite the process to create Telangana state as soon as possible.

Dr. Manmohan Singh
Prime Minister of IndiaTEL. (O) :
+91 11 23012312, +91 11 23013149, +91 11 23016857
TEL. (R) : +91 11 23018939, +91 11 23011156, +91 11 23018907
TEL. (PH) : +91 11 23017660, +91 11 23019817, +91 11 23034960

Smt. Sonia GandhiTEL. (O) +91 11 23034984, +91 11 23034285
TEL. (R) +91 11 23014161, +91 11 23014481
Fax : +91 11 23018651

Shri Pranab MukherjeeTEL. (O) +91 11 23011165, +91 11 23011127, +91 11 23011463
TEL. (R) +91 11 23737623, +91 11 23323042

Shri Sharad Pawar+91 11 23383370 (A)
+91 11 23384129 (Fax)
+91 11 23388165
+91 11 23382756 (Fax)

Shri P. Chidambaram+91 11 23381213
+91 11 23386645
+91 11 23387333 (Fax)

Kumari Mamata Banerjee+91 11 23381213
+91 11 23386645
+91 11 23387333 (Fax)

Shri M. Veerappa Moily+91 11 23384567 +91 11 23010008 (O)
+91 11 23015223 (Fax)
Mobile : 9845536333

Shri Ahmed Patel+91 11 23014669
+91 11 23793801 (Fax)

Shri Rahul Gandhi+91 11 23019056, +91 11 23019080 (O)
+91 11 23795161 (R)
+91 11 23012410 (Fax)

1. Facts: Based on the facts, Telangana has been discriminated for decades by Andhra rulers. Even Home Minister Shri Chidambaram acknowledged it while announcing the Telangana sate on Dec 9th. 2. Telangana is unique: There are many demands for separate states, but Telangana is unique. The merger with Andhra was not unconditional. Forced merger of Telangana with Andhra was opposed by Telangana people, then CM, B. Ramakrishna Rao and first SRC (Fasal Ali commission). The conditional merger failed time and again. Andhra leader broke all the agreement between Telangana and Andhra starting from Gentlemen's agreement, Mulki rules, to 610 Go, which gives preferential treatment to local people. Even Prime Minister Nehru said in 1956 that Telangana can separate from Andhra, if Telangana people don't like the merger at a later date. 3. Globalization: We don't want to miss the fruits of the globalization. Even though Hyderabad city has many IT and Pharma , most of our young people don't have adequate education to take up the jobs. Our education system has been discriminated for the last 5 decades and we can only improve our children lives with our own rule. 4. National interest: We tell the world that we have more number of young people than any other country in the world. If we don't provide the young people adequate development and proper education, they will be restless and they might lean towards extremism. Based on the past history of violent struggles in Telangana, it is in our national interest to develop Telangana immediately.. Status quo doesn't work, so we need to expedite the Telangana state process as soon as possible. 5. Exploitation. Our people have been exploited for last 50 years. Thousands of our young people in Gulf jails, hundreds of thousands of people migrated to other parts of country, because of no livelihood in Telangana. We like our hi-tech city, but not over the dead bodies of thousands of farmers, weavers and others, who committed suicide leaving vulnerable women and children on the street. It is time to make the state a reality. 6. Water discrimination . More than eight percent of the Telangana depend on agriculture. Most of the farmers still depend on the well irrigation. The well irrigation is expensive with constant problems with the electric motors. The amount of land cultivated through canals in just Guntur district of Andhra is more than the land cultivated with canals in entire Telangana region. 7. Smaller states are better to administer. Amazingly, all three new states, Jharkhand , Chhattisgarh and Uttarakhand have grown fabulously fast. Uttarakhand has averaged 9.31% growth annually, Jharkhand 8.45%, and Chattisgarh 7.35%. These underdeveloped parts of the big states, emerged highly dynamic states. There are two main rivers in South India passing through Telangana. Telangana can grow faster by utilizing the water, natural resources effectively for the state. 8. United for Telangana: People from all walks of life, students, teachers, employees, labor unions, business groups and political leaders are eagerly waiting for the new state. 9. Selfish motives of Andhra leaders: Selfish Andhra leaders are instigating agitation for their personal benefit. Their only argument is, we speak the same language and we should be together. They have no answer for why Telangana is backward and what they are planning to do. 10. Minority: Telangana has 119 MLAs, and Andhra has 175 MLAs. Numerically Andhra leaders are strong, so they belittled Telangana leaders and people time and again. So we need to your help to create Telangana state. 11. Suffering: Telangana people suffered during Razakar movement before 1948, now we are suffering with Andhra leaders. We need your help to liberate us from the clutches of power hungry, selfish Andhra leaders. Our young people are unemployed, our farmers are in huge debt, our poor people are hungry, our children are working in the fields and our elderly don't have adequate medical facilities. We need the state now, not later. Andhra leaders argument is that we speak the same language. There are many Hindi speaking states, so there is no merit to their argument. We are in need for food, shelter, education, water and employment with our own state, Please expedite the process of creating Telangana state.