Tuesday, March 2, 2010

విభజిస్తే తప్పేంటి?

రాష్ట్ర మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెలిబుచ్చిన అభిప్రాయం సమైఖ్యవాదుల్లోకూడా సానుకూల చర్చకు
అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఏం.ఎల్,ఏ, శ్రీ వసంత నాగేశ్వర్ రావు, ఎం.పి.హర్షకుమార్, హరిరామ జోగయ్య, సీనియర్ జనరలిస్ట్ పొత్తూరి నాగేశ్వర్ రావులాంటి వారు ఇలాంటి అభిప్రాయాలనే పలుసందర్భాలలో వెల్లడించారు. వీరంతా లోతుగా విశ్లేషించి అణు నిత్యం కలతలతో కూడిన కాపురం కొనసాగదని, ఏ రకంగా ఆలోచించినా భవిష్యత్
పరిణామాలు తీవ్రంగా వుంటాయని, తెలుగు రాష్ట్రాలు రెండు వుంటేనే ఇరు ప్రాంతాలు మరింత అభివృద్ధి
చెందుతాయని, కాదూ కూడదన్నా ఇలాగే కలిసివుంటామంటే సీమాంధ్రుల ఆత్మగౌరవంకూడా దెబ్బతింటోందని,
మరింత మనసులు విరుగకముందే అన్నదమ్ముల్లా విడిపోవడం అందరికీ మంచిదని హితవు పలికారు.
ఇప్పుడు రాష్ట్రమంత్రి హోదాలోవుండి కూడా నిజాయితీగా, నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం సర్వదా హర్షణీయం, ఆమోదయోగ్యం.కానీ బొత్సాపై క్రమశిక్షణాచర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కొందరు సమైఖ్యవాదులు
ఫిర్యాదు చెయ్యాలనుకుంటే, మరి ఆ అధిష్టానమే "కంచే చేనుమేసినప్పుడు" దానికున్న నైతికబలం ఏపాటిది? ఉదాహరణకు నీటి మూటల్ని తలపించే కాంగ్రెస్ పెద్దల మాటలు గమనిద్దాం:
1) ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్బంలోనే ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు వెలిబుచ్చిన
ప్రమాదసూచికల్ని ఆయన వారసులు / కాంగ్రెస్ పార్టీ నేతలు పాటించకపోవడం ఆయన మనోభావాల్ని అగౌరవపరచినట్లు కాదా?
"एक मासूम लडकी को एक नतूकत लड़का से शादी किया गया, चलेतो चले,
अगर नचलेतो कबीबि तलाक" - जवहरलाल नेहरूजी
ఏనాడో అన్నమాటలు ఊరికే అన్నట్లా? వచ్చే కలతల్ని, జరిగే అవకతవకల్ని ఆనాడే పసిగట్టి హెచ్చరించడం
విస్మరించరానిది కాదా? అనగా...
"ఒక అమాయకపు అమ్మాయికి గడసరి అబ్బాయితో పెళ్లి జరిగింది, కలిసివుంటే సరే,
లేకుంటే విడాకులే"- నెహ్రూజీ


ఇంగ్లీష్ లో.. * “The Andhra and Telangana merger is like marrying an
innocent bride*


*to a naughty husband. If it goes well let it could be as is, but if it
doesn’t they can get*

*divorced at any moment”*- Jawaharlal Nehru

* ["It is like a matrimonial alliance having provision of
divorcé, if you wish not to continue with it"]*

2) Sonia and her Congress party are very well aware of the fact that
they won the majority of seats in AP and was able to form governments in
state and center just because of Telangana issue - yet in a typical
Congress's age old "politics of convenience and betrayals" - they managed to put the demand and wish of 3.5 crores of Telangana people in storage for the past 3 and half years.

3) Prime Minister Manmohan Sigh says that :

*“The common minimum program is already spells out under what we
need to do*

* in this regard, we need to consult all concerned, and other
proper consultations *

* we are committed to establishment of Telangana...”*

4) Former President Abdul Kalam in his presidential address says that:

*“The Govt will consider demand for formation of Telangana state
at an appropriate*

* time for due consultation.”*

5) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అలా హామీలివ్వడమేగాక ఆంధ్ర-హైదరాబాద్ ఇరు
రాష్ట్రాలను విలీనం చేసి

షరతులతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణను కాంగ్రెస్ పెద్దలు జేసుకొని
అన్నింటినీ

ఉల్లంఘించింది నిజం కాదా? ఈ అర శతాబ్ది పైగా జరిగిన సమైఖ్య
రాష్ట్రపాలనలో ఏనాడైనా

సవ్యంగా,ఎలాంటి వివక్ష లేకుండా జరిగిందా? ఇక ఇప్పుడు నిజాయితీగా
మాట్లేడేవారు దోషులా?


లేక స్వార్థ రాజకీయాలతో ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ నయవంచనజేసేవారు
దోషులా?


ఎవరు శిక్షార్హులు? కాలమే నిర్ణయిస్తుంది..


కోస్తాంధ్రకు చెందిన *బొత్సా** **సత్యనారాయణ* కాబోయే ప్రత్యేక
ఆంధ్రరాష్ట్రానికి సీ.ఎం.కావాలనే ఈ యాగీని


చేస్తున్నారన్న కువిమర్శలు కట్టిపెట్టాలి. ఇంత జరిగాక ఇంకా కలిసి ఉండగలమా?
కోర్టులు,వ్యాపార-విద్యా


సంస్థలు, నిఘా-భద్రతా వ్యవస్థలు అన్నీ నిట్టనిలువునా ఇప్పటికే చీలిపోవడమైంది.
పిల్లల ప్రశ్నాపత్రాల


దిద్దడంకూడా వేర్వేరుగాఉండాలనే వాదనలు వచ్చినాక, ఉద్యోగ వర్గాల్లో వైషమ్యాలు
పెరిగినాక ఇంకా


ఎలా కలిసివుండగలం? సోదర భావంతో ఎవరికివారు కలతలు లేకుండా, ఎవరి రాష్ట్రంలో వారు
గౌరవంగా


ఉందామని స్వాగతిద్దాం. నెహ్రూజీ మాటల్ని గౌరవిద్దాం.


జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

Link From www.yuvatelangana.com

No comments:

Post a Comment