Friday, March 26, 2010

తెలంగాణా ఇ మాట లోనే ఓ దీరత్వం..

ఓ సూరత్వం.. ఇంచు ఇంచు కి ఓ పోరు బిడ్డ

గడప గడప కు ఓ వీరనారి

ఈ మట్టి లోనే ఏదో తెలియని భావోద్వేగం

ఉహకంధని ఉధ్యమాలు....

నెలకొరిగి నింగికేగీసిన తారలెందరో !

పోరు బాట లో కదమ్ తొక్కిన పులిబిడ్డ లెందరో !!



అమరులైన బిడ్దలను గుండెకద్దుకుని

కన్నీళ్లతో జోహార్లర్పించిన పల్ళేలెన్నో..

ప్రతి రోజు బతుకు కొరకు పోరు చేస్తూ

పోరాటమే మా బతుకు అంటరు

ఉద్యమాలే మా ఆతుకుల బతుకులకు

మెతుకులు అంటరు



ఏ గుండె ను కదిలించిన క"న్నిటి"గాథలే

ఏ పల్లె ను విప్పిన ఉద్యమాల చరిత్రలే

ఉరూర కొమురంబీమ్ లు ఉంటరూ

వాడ వాడ న వీరులు ఉంటరూ

కొంగు నడుముకు చుట్టి

పిడికిలీ బిగించి గర్జించే

వీర నారీ మణులు ఉంటరూ

ఉద్యమాల ఉరుములో

బిడ్డల ను త్యాగం చేసే తల్లులు ఉంటరూ



డప్పుల్లో దరువెస్తు కాళ్లకు గజ్జెలు కట్టి

జాజ్జనకర జానరె అనే కళాకారులు

ప్రతి మట్టి ఇంట్లో ఉంటరూ

వారికి దన్నుగా కళా పోషకులు ఉంటరూ

నా తల్లి బారతాన సుగంధ సువాసానలున్న నా తెలంగాణా

విశ్వ సర్వస్వం న రతనాల వీణ

నా బాష, నా యాస ఓ స్వచ్ఛమైన శ్వాష

నా శ్వాష, నా ప్రాణం నా సుంధర తెలంగాణా !!!

జై తెలంగాణా !!

గాయ పడ్డ తెలంగాణా గర్జించ క మన ధు

గాయ పడ్డ తెలంగాణా


గర్జించ క మన ధు

ధగా పడ్డ తెలంగాణా

వీర విప్లవ్ తెలంగాణా

తీరుగబడక మానధు

స్వాతంత్రం రా ని తెలంగాణా

స్వాతంత్రం లేని తెలంగాణా

ోరాడక మానధు

ఇప్పుడు మాకు మిగిలింధీ

అవమానాలు--ఆసమానతలు

అక్రోషాలు--జారే కన్నీళ్ళు

పొగలు--సెగ లు--గాయాలు

గాయమయినా బ్రతుకులు

బితుకు బితుకు జీ వి తా లు

నేడు --మా పల్లెల్లో జనాలు

గూడు లేని గువ్వాలు

తోడు లేని అవ్వ లు

తాదులేని బొంగరాల జీ వి తా లు

దారం తెగిన గాలిపటం లా మనసుల1



న్నినటిధా క --తెలంగాణా

ఒక రాజకీయ యాపార వస్తువు

అధికార సొపానానికి ఉపయోగపడే

ఒక ని నా ధ ము

చేతకాని--చేవ లేని

నేత రాజ్యం లో

చూస్తూ న్న ధీ

కొత్త ప్రామిసులు-

కొత్త మోసాలు

కొత్త ఎత్తులు--కొత్త జిత్తులు

పై స ల గల గల

కులం జల జల ల తో

అగ్రకులాల మధ్య ఆట (గేమ్ )

ఇది మన ప్రజాసామ్యం ????



కావాలని కయ్యానికి దూరకు

సె సె కీడు సె సె సు కుంట

దొంగ క మే టి లు--కాలయాపనలు

ఊలన్గనలు--యొప్పందాలు కాలరాయడం

ఓంకరి --టిం క రీ వ గ ల మాటలు

ఇక వద్ధు

ఇక ఊకోం

ఇక ఈనేధీ--గనేధీ లెధు

నమ్మకం ఆవిరి అయిపోయింధీ



బ్రతికి ఉన్నంత కాలం

కాకతీయ తో ర నం సాచిగా

వేయి స్టంబాల గుడి మీ ధ ఓ ట్టూ

ఇసాబ్ కోసం

మేము తీరుగబడక మానం

గుర్తుంచుకో

నిజాం నవాబ్ ను గద్దె దిప్పింధీ మేమే

జమీందార్ల ---జాగిర్దార్ల

చరమ గీతం పాడి న ధీ మేమే



ప్రజలంతా సంగ టీకా శక్తి గా మారడం కాయం

జై తెలంగాణా సునామీ రానుంధీ

ఉద్యమం మా ఊపిరి

అన్ని హంగులతో

అన్ని సంగాలు ఒక్కటి అయి

ఒకే మాట--ఒకే పా ట పాడుతూ కొత్త రకం ఉద్యమం చేపడుతాం

తెలంగాణా సాదించి తీరుతాం

ఇది ఆచ్చరాల స త్తేం

ఆగులు -బు గు లు మాటలు కావు

కొత్త చరిత్ర రాసి సూపెడుతాం

రేపటి విజయం మాదే

అదొక్కటే మా తోవ్వ

జై తెలంగాణా --మా చివరి గమ్య

అమరుడిన యాదన్న కన్నీటి గాథ

అమరుడిన యాదన్న కన్నీటి గాథ

అతడొక అమరవీరుడు అంటారు కొందరు..


కాదు పిరికి వాడంటారు ఇంకొందరు..

అదొక తొందరపాటు చర్యంటారు కొందరు..

నేను సైతం రేగుతున్న విప్లవానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చాను అంటాడు అతడు..

అమ్మా లేదు, నాన్న లేడు, వాడు చస్తె ఎంత అన్నట్టు ఆంధ్ర నాయకులు..
ఎవరన్నారు..4 కోట్ల బందువులున్నం యాదయ్యని యాదికి తెచ్చుకోనికి..

మేనమామ అన్నడు ఈడ్నే పంజూస్కో కొడుకా అని..ఇదే నా పనన్నడు..
ఇందుకోసమే నేను పుట్టిన అన్నడు..

ఎవరేం చెప్తె అది నమ్మిండు..

చిరంజీవి చెప్పిండు జై తెలంగాణ అని..

యాదయ్య జై చిరంజీవి అన్నడు..

చంద్ర బాబు చెప్పిండు జై తెలంగాణ అని..

తమ్ముడు జై చంద్ర బాబు అన్నడు..

అమరుడైన తెలంగాణ బిడ్డ ఇంద్రన్న ఆశయాల సాధనకోసం పంచేస్త అన్నది సబితమ్మ..తమూడు జై సబితమ్మ అన్నడు..

చివరుకు యాదన్న కలల సాకారం తెలంగాణాచ్చింది..

యాదన్న దండం పెట్టిండు… మీరంత నా దేవుల్లన్నడు

---------------------------------------------------------------

కని ఇంటి గుమ్మంలనే చిరంజీవి చెప్పుదెబ్బ కొట్టి పంపిండు ..

తెలంగానేందిరా నీ అబ్బ సొత్తా అని..

చంద్ర బాబు దగ్గరికి పొయిండు..

యే లే ఉత్తగనే అన్న కని ప్రబుత్వం గిట్ల తెలంగాణ ఇస్తదని అనుకోలె..

మనం సమిష్టి పంచేసి స్వర్నాంధ్ర చెయ్యాలె గని తెలంగానేంది తమ్మి అన్నడు..

నాలుగు వాతలు పెట్టి పంపిండు..

సబితమ్మ దగ్గరుకు పొయిండు కొండంత ఆశతోని..

తమ్ముడూ ఇగో నా చేతిల యేం లేదు..

ఆల్లెంత చెప్తె నేను గంతే..

ఇంతల పోలీసొడొకడచ్చి తెలంగాణ పేరెత్తంగనే యాదన్నని కుల్లబొడుసుడు మొదలుపెట్టె..ఒక్కడ్ని చేసి పోరన్ని కుక్కలెక్క కొట్టి రబ్బరు బుల్లెట్ల తోని కాల్షిండ్లు..

సబితమ్మ మొత్తం చూశి అరె ఎంత పనైపాయె..

పాపం గట్ల కొట్టకున్లి పోరన్ని అని కూడ అన్లే..

మొత్తం కొట్టుడయినంక సారీ చెప్పున్లి పపం దెబ్బల్ తిన్నడు బాగ అంటె

పోలిసోల్లకి జరంత ద్యాసచ్చి సారి చెప్పి పంపిన్లు..

ఫోన్ తీషిండు యాదన్న..

ఎవరికన్న చేద్దామని..

అమ్మా, నాన్నల్లేని అనాధ..

తెలంగాణె తల్లై, పోరాటమె తండ్రై బతుకుతున్న ఓ అమాయక విద్యార్థి..

ఎమ్మెల్యేలకు ఫోన్ కొత్తి అడిగిండు..

అన్నా గిట్లైంది..మీరు రాజినామ చేషి నిరసన చెయ్యాలె..

అరె జరంత ఉండు తమ్మి …

మనం పవర్ల ఉంటెనే ఎమన్న చేస్తం అని కట్ చేసిండు ఎమ్మేల్యే సాబ్..

----------------------------------------------------------------

ఫోన్ల సిం కార్డు తీశి ఔతల పడేషిండు యాదన్న..

గా దేవుల్లందరితోని దిగిన ఫోటొలు సంచిల పెట్టుకున్నడు…
ఎవరన్న కనిపిస్తె అడుగుదాం నేనేం తప్పు చేశిన గిట్ల శిక్షిస్తున్లు నన్ను అని..

ఎవ్వరు దొరకలే..

దెబ్బలాగుతలేవు..

బొబ్బలు తగ్గుతలెవ్వు…

తిన్న దెబ్బల గాయాలు, వాతల బాధలు సలుపుతున్నయ్..

పోరడు అస్తిత్వం కోసం బయలు దేరిండు..

తెలంగాణ ఎవ్వరు తెస్తేంది తేకుంటేంది అని

ఒంటరిగ బయలు దేరిండు..

వీధి వీధి వాడ వాడ వాడే..

ఉస్మానియా లాటీ చార్జిల వాడె..

గర్జనల్ల వాడె..

ఉప్పెనై, పెను తుఫానై వాడె..

ఎక్కడ సూషిన వాడె..

వాడు రగిలించిన విప్లవం రాష్త్రమంత అలజడి రేపింది…

సుడిగాలిలా మారి వడగాలిని రేపుతుంది..

రాజకీయ సంక్షోభం యేర్పడ్డది..

వానికి తోడుగ వేల గొంతుకలు..

అనాధని ఎవరన్నరు…

మతిలేనోడె అంటడామాట…

సమైక్య ప్రపంచం దద్దరిల్లింది..

అతలకుతలమయ్యింది..

పక్క దారిన దొంగ మాటు వేసింది వాడి హ్రుదయం మీద..

వాడి మనసులొ అలజడి రేపింది..

మానసిక సంక్షోభాన్ని లేపింది..

వాడిని నిలువునా తగులబెట్టింది..

ఆ మంటల్ల కాలుతున్న తెలంగాణ ఆత్మాభిమాన ఆర్తనాదాన్ని చూసి వికట్టట్టహాసం

చేసింది..కొన్ని ప్రష్నలు..

ఇంతకీ యాదన్న మనిషేనా..

లేదంటె తెలంగాణ అస్తిత్వం మానవ రూపం దాల్చిందా..

లేదంటె ఆ మంటల్ల మా దైన్యం, నిస్సాహయతని ఎత్తి చూపుతుందా..

లేదంటె తనకు సాయం రాని సంఘం అసమానతలని తట్టి లేపుతుందా..

లేదంటె కలుతున్నది స్సమానత్వ అప్రజాస్వామ్యమా..

లేదంటె గాయపడ్డ తెలంగాణ తల్లి నిత్యక్షోభ ఆర్తనాదమా..

లేదంటె దగాపడ్డ నా ప్రజల ఓటమా..

ఇంతకీ యాదన్నని సంపిందెవరు???



----------------------------------------------------

ఏమో మరి..

ఇన్ని ప్రష్నలకి సమాధానం దొరకక సతమతమవుతుంటె..

పిరికి చర్య అంటడేందో మరి చంద్ర బాబు..

ఎమో మరి..మీకే తెల్వాలె..

జగమెరిగిన జగన్నాటక సూత్ర ధారులు…

నీటముంచినా, నిలువునా కాల్చినా

మీ మాటే మా వేద మంత్రం..

మీ సమైక్యతా, అభివ్రుద్దే మా అంతిమ ధ్యేయం..

మీ కాలి కింద చెప్పులం..

నాలుగు కోట్ల అనాధలం..

సీమాంధ్రప్రదేష్ సమైక్యాంధ్ర సాక్షిగా

వెయ్యి కాలాలు బాగుండాలె..

మీరు, మీ పిల్లలు అందరూ సల్లగ ఉండాలె..

మీ పొలాల్ల మా నీల్లు కలకాలం పారాలె..

మీరందరు మా జాగల్ల సుఖం గ ఉండాలె..

మీ పోరగాల్లందరికి ...

కవిత-తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?

తెలంగాణ వేరైతే



దేశానికి ఆపత్తా?


తెలంగాణ వేరైతే


తెలుగుబాస మరుస్తారా?


తెలంగాణ వేరైతే


కిలోగ్రాము మారుతుందా?


తెలంగాణ వేరైతే


తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే


చెలిమి తుట్టి పడుతుందా?


తెలంగాణ వేరైతే


చెలిమి లెండిపొతాయా?


కులము తగ్గిపొతుందా


బలము సన్నగిలుతుందా


పండించి వరికర్రల


గింజ రాలనంటుందా?


రూపాయికి పైసాలు


నూరు కాకపొతాయా?


కొర్టు అమలు అధికారము


ఐ.పి.సి. మారుతుందా?


పాకాల, లఖ్నవరం


పారుదలలు ఆగుతాయా?


గండిపేటకేమైనా


గండితుటు పడుతుందా?


ప్రాజెక్టులు కట్టుకున్న


నీరు ఆగనంటుందా?


పొచంపాడు వెలసి కూడ


పొలము లెండిపొతాయా?


తెలంగాణ వేరైతే


దేశానికి ఆపత్తా?






–కాళోజీ

Wednesday, March 24, 2010

తెలంగాణా-- నాలుగు కోట్ల ప్రజల జన్మ హక్కు

నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల జన్మ హక్కు

మా కృష్ణ గోదావరి నీళ్ళు మాకు కావాలె

మా భూములు మాకు కావాలె

మా బొగ్గు తోని తాయారు అయిన

విద్యుత్తు మాకు కావలె

మా కొలువులు మాకు కావలె

మా తాతల చెమట  నెత్తురు తోని కట్టిన

హైదరాబాద్ మాకు కావాలె

పొట్ట చేత పట్టుకొని

వొచ్చినోని తోని మాకు బాధ లేదు,

 దోచుకొను వచ్చినోన్ని తెలంగాణా పొలిమేరలకు

తరిమి కొడుతం

సిపాయి తిరుగుబాటు విఫలమయ్యింది అని ఆగిందా భారత

స్వతంత్ర సంగ్రామం

ఒక తరం వోరిగిపోతే ఇంకొక తరం అందుకోలేద పోరాట పందాను

నిజాం దోపిడి రజాకార్ ల దౌర్జన్యం పోయింది
అని ఆగిందా తెలంగాణా కోరిక ఆంధ్ర

దొరల దోపిడీకి తుపాకి దెబ్బలకు వోరగాలేద తెలంగాణా అమరవీరులు

తెలంగాణా  స్వయం పాలన కోరిక తరం తరం నిరంతరం ఎగసిపడే ఉప్పెన

జై తెలంగాణా....

Wednesday, March 3, 2010

Telangana Kavitha

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?

–కాళోజీ

Tuesday, March 2, 2010

విభజిస్తే తప్పేంటి?

రాష్ట్ర మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వెలిబుచ్చిన అభిప్రాయం సమైఖ్యవాదుల్లోకూడా సానుకూల చర్చకు
అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఏం.ఎల్,ఏ, శ్రీ వసంత నాగేశ్వర్ రావు, ఎం.పి.హర్షకుమార్, హరిరామ జోగయ్య, సీనియర్ జనరలిస్ట్ పొత్తూరి నాగేశ్వర్ రావులాంటి వారు ఇలాంటి అభిప్రాయాలనే పలుసందర్భాలలో వెల్లడించారు. వీరంతా లోతుగా విశ్లేషించి అణు నిత్యం కలతలతో కూడిన కాపురం కొనసాగదని, ఏ రకంగా ఆలోచించినా భవిష్యత్
పరిణామాలు తీవ్రంగా వుంటాయని, తెలుగు రాష్ట్రాలు రెండు వుంటేనే ఇరు ప్రాంతాలు మరింత అభివృద్ధి
చెందుతాయని, కాదూ కూడదన్నా ఇలాగే కలిసివుంటామంటే సీమాంధ్రుల ఆత్మగౌరవంకూడా దెబ్బతింటోందని,
మరింత మనసులు విరుగకముందే అన్నదమ్ముల్లా విడిపోవడం అందరికీ మంచిదని హితవు పలికారు.
ఇప్పుడు రాష్ట్రమంత్రి హోదాలోవుండి కూడా నిజాయితీగా, నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం సర్వదా హర్షణీయం, ఆమోదయోగ్యం.కానీ బొత్సాపై క్రమశిక్షణాచర్య తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కొందరు సమైఖ్యవాదులు
ఫిర్యాదు చెయ్యాలనుకుంటే, మరి ఆ అధిష్టానమే "కంచే చేనుమేసినప్పుడు" దానికున్న నైతికబలం ఏపాటిది? ఉదాహరణకు నీటి మూటల్ని తలపించే కాంగ్రెస్ పెద్దల మాటలు గమనిద్దాం:
1) ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్బంలోనే ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు వెలిబుచ్చిన
ప్రమాదసూచికల్ని ఆయన వారసులు / కాంగ్రెస్ పార్టీ నేతలు పాటించకపోవడం ఆయన మనోభావాల్ని అగౌరవపరచినట్లు కాదా?
"एक मासूम लडकी को एक नतूकत लड़का से शादी किया गया, चलेतो चले,
अगर नचलेतो कबीबि तलाक" - जवहरलाल नेहरूजी
ఏనాడో అన్నమాటలు ఊరికే అన్నట్లా? వచ్చే కలతల్ని, జరిగే అవకతవకల్ని ఆనాడే పసిగట్టి హెచ్చరించడం
విస్మరించరానిది కాదా? అనగా...
"ఒక అమాయకపు అమ్మాయికి గడసరి అబ్బాయితో పెళ్లి జరిగింది, కలిసివుంటే సరే,
లేకుంటే విడాకులే"- నెహ్రూజీ


ఇంగ్లీష్ లో.. * “The Andhra and Telangana merger is like marrying an
innocent bride*


*to a naughty husband. If it goes well let it could be as is, but if it
doesn’t they can get*

*divorced at any moment”*- Jawaharlal Nehru

* ["It is like a matrimonial alliance having provision of
divorcé, if you wish not to continue with it"]*

2) Sonia and her Congress party are very well aware of the fact that
they won the majority of seats in AP and was able to form governments in
state and center just because of Telangana issue - yet in a typical
Congress's age old "politics of convenience and betrayals" - they managed to put the demand and wish of 3.5 crores of Telangana people in storage for the past 3 and half years.

3) Prime Minister Manmohan Sigh says that :

*“The common minimum program is already spells out under what we
need to do*

* in this regard, we need to consult all concerned, and other
proper consultations *

* we are committed to establishment of Telangana...”*

4) Former President Abdul Kalam in his presidential address says that:

*“The Govt will consider demand for formation of Telangana state
at an appropriate*

* time for due consultation.”*

5) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అలా హామీలివ్వడమేగాక ఆంధ్ర-హైదరాబాద్ ఇరు
రాష్ట్రాలను విలీనం చేసి

షరతులతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణను కాంగ్రెస్ పెద్దలు జేసుకొని
అన్నింటినీ

ఉల్లంఘించింది నిజం కాదా? ఈ అర శతాబ్ది పైగా జరిగిన సమైఖ్య
రాష్ట్రపాలనలో ఏనాడైనా

సవ్యంగా,ఎలాంటి వివక్ష లేకుండా జరిగిందా? ఇక ఇప్పుడు నిజాయితీగా
మాట్లేడేవారు దోషులా?


లేక స్వార్థ రాజకీయాలతో ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ నయవంచనజేసేవారు
దోషులా?


ఎవరు శిక్షార్హులు? కాలమే నిర్ణయిస్తుంది..


కోస్తాంధ్రకు చెందిన *బొత్సా** **సత్యనారాయణ* కాబోయే ప్రత్యేక
ఆంధ్రరాష్ట్రానికి సీ.ఎం.కావాలనే ఈ యాగీని


చేస్తున్నారన్న కువిమర్శలు కట్టిపెట్టాలి. ఇంత జరిగాక ఇంకా కలిసి ఉండగలమా?
కోర్టులు,వ్యాపార-విద్యా


సంస్థలు, నిఘా-భద్రతా వ్యవస్థలు అన్నీ నిట్టనిలువునా ఇప్పటికే చీలిపోవడమైంది.
పిల్లల ప్రశ్నాపత్రాల


దిద్దడంకూడా వేర్వేరుగాఉండాలనే వాదనలు వచ్చినాక, ఉద్యోగ వర్గాల్లో వైషమ్యాలు
పెరిగినాక ఇంకా


ఎలా కలిసివుండగలం? సోదర భావంతో ఎవరికివారు కలతలు లేకుండా, ఎవరి రాష్ట్రంలో వారు
గౌరవంగా


ఉందామని స్వాగతిద్దాం. నెహ్రూజీ మాటల్ని గౌరవిద్దాం.


జై తెలంగాణా! జై జై తెలంగాణా!!

Link From www.yuvatelangana.com