Monday, February 22, 2010

Yadanna Telangana amaruni heart touching poem



అతడొక అమరవీరుడు అంటారు కొందరు..
కాదు పిరికి వాడంటారు ఇంకొందరు..
అదొక తొందరపాటు చర్యంటారు కొందరు..

నేను సైతం

రేగుతున్న విప్లవానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చాను అంటాడు అతడు..
అమ్మా లేదు, నాన్న లేడు, వాడు చస్తె ఎంత అన్నట్టు ఆంధ్ర నాయకులు..

ఎవరన్నారు..
4 కోట్ల బందువులున్నం యాదయ్యని యాదికి తెచ్చుకోనికి..
మేనమామ అన్నడు ఈడ్నే పంజూస్కో కొడుకా అని..
ఇదే నా పనన్నడు..
ఇందుకోసమే నేను పుట్టిన అన్నడు..

ఎవరేం చెప్తె అది నమ్మిండు..
చిరంజీవి చెప్పిండు జై తెలంగాణ అని..
యాదయ్య జై చిరంజీవి అన్నడు..
చంద్ర బాబు చెప్పిండు జై తెలంగాణ అని..
తమ్ముడు జై చంద్ర బాబు అన్నడు..
అమరుడైన తెలంగాణ బిడ్డ ఇంద్రన్న ఆశయాల సాధనకోసం పంచేస్త అన్నది సబితమ్మ..
తమూడు జై సబితమ్మ అన్నడు..
చివరుకు యాదన్న కలల సాకారం తెలంగాణాచ్చింది..
యాదన్న దండం పెట్టిండు… మీరంత నా దేవుల్లన్నడు
---------------------------------------------------------------

కని ఇంటి గుమ్మంలనే చిరంజీవి చెప్పుదెబ్బ కొట్టి పంపిండు ..
తెలంగానేందిరా నీ అబ్బ సొత్తా అని..

చంద్ర బాబు దగ్గరికి పొయిండు..
యే లే ఉత్తగనే అన్న కని ప్రబుత్వం గిట్ల తెలంగాణ ఇస్తదని అనుకోలె..
మనం సమిష్టి పంచేసి స్వర్నాంధ్ర చెయ్యాలె గని తెలంగానేంది తమ్మి అన్నడు..
నాలుగు వాతలు పెట్టి పంపిండు..

సబితమ్మ దగ్గరుకు పొయిండు కొండంత ఆశతోని..
తమ్ముడూ ఇగో నా చేతిల యేం లేదు..
ఆల్లెంత చెప్తె నేను గంతే..
ఇంతల పోలీసొడొకడచ్చి తెలంగాణ పేరెత్తంగనే యాదన్నని కుల్లబొడుసుడు మొదలుపెట్టె..

ఒక్కడ్ని చేసి పోరన్ని కుక్కలెక్క కొట్టి రబ్బరు బుల్లెట్ల తోని కాల్షిండ్లు..
సబితమ్మ మొత్తం చూశి అరె ఎంత పనైపాయె..
పాపం గట్ల కొట్టకున్లి పోరన్ని అని కూడ అన్లే..
మొత్తం కొట్టుడయినంక సారీ చెప్పున్లి పపం దెబ్బల్ తిన్నడు బాగ అంటె
పోలిసోల్లకి జరంత ద్యాసచ్చి సారి చెప్పి పంపిన్లు..

ఫోన్ తీషిండు యాదన్న..
ఎవరికన్న చేద్దామని..
అమ్మా, నాన్నల్లేని అనాధ..
తెలంగాణె తల్లై, పోరాటమె తండ్రై బతుకుతున్న ఓ అమాయక విద్యార్థి..
ఎమ్మెల్యేలకు ఫోన్ కొత్తి అడిగిండు..
అన్నా గిట్లైంది..మీరు రాజినామ చేషి నిరసన చెయ్యాలె..
అరె జరంత ఉండు తమ్మి …
మనం పవర్ల ఉంటెనే ఎమన్న చేస్తం అని కట్ చేసిండు ఎమ్మేల్యే సాబ్..
----------------------------------------------------------------

ఫోన్ల సిం కార్డు తీశి ఔతల పడేషిండు యాదన్న..
గా దేవుల్లందరితోని దిగిన ఫోటొలు సంచిల పెట్టుకున్నడు…
ఎవరన్న కనిపిస్తె అడుగుదాం నేనేం తప్పు చేశిన గిట్ల శిక్షిస్తున్లు నన్ను అని..

ఎవ్వరు దొరకలే..
దెబ్బలాగుతలేవు..
బొబ్బలు తగ్గుతలెవ్వు…
తిన్న దెబ్బల గాయాలు, వాతల బాధలు సలుపుతున్నయ్..
పోరడు అస్తిత్వం కోసం బయలు దేరిండు..
తెలంగాణ ఎవ్వరు తెస్తేంది తేకుంటేంది అని
ఒంటరిగ బయలు దేరిండు..
వీధి వీధి వాడ వాడ వాడే..
ఉస్మానియా లాటీ చార్జిల వాడె..
గర్జనల్ల వాడె..
ఉప్పెనై, పెను తుఫానై వాడె..
ఎక్కడ సూషిన వాడె..
వాడు రగిలించిన విప్లవం రాష్త్రమంత అలజడి రేపింది…
సుడిగాలిలా మారి వడగాలిని రేపుతుంది..
రాజకీయ సంక్షోభం యేర్పడ్డది..
వానికి తోడుగ వేల గొంతుకలు..
అనాధని ఎవరన్నరు…
మతిలేనోడె అంటడామాట…
సమైక్య ప్రపంచం దద్దరిల్లింది..
అతలకుతలమయ్యింది..
పక్క దారిన దొంగ మాటు వేసింది వాడి హ్రుదయం మీద..
వాడి మనసులొ అలజడి రేపింది..
మానసిక సంక్షోభాన్ని లేపింది..
వాడిని నిలువునా తగులబెట్టింది..
ఆ మంటల్ల కాలుతున్న తెలంగాణ ఆత్మాభిమాన ఆర్తనాదాన్ని చూసి వికట్టట్టహాసం
చేసింది..
కొన్ని ప్రష్నలు..
ఇంతకీ యాదన్న మనిషేనా..
లేదంటె తెలంగాణ అస్తిత్వం మానవ రూపం దాల్చిందా..
లేదంటె ఆ మంటల్ల మా దైన్యం, నిస్సాహయతని ఎత్తి చూపుతుందా..
లేదంటె తనకు సాయం రాని సంఘం అసమానతలని తట్టి లేపుతుందా..
లేదంటె కలుతున్నది స్సమానత్వ అప్రజాస్వామ్యమా..
లేదంటె గాయపడ్డ తెలంగాణ తల్లి నిత్యక్షోభ ఆర్తనాదమా..
లేదంటె దగాపడ్డ నా ప్రజల ఓటమా..
ఇంతకీ యాదన్నని సంపిందెవరు???

----------------------------------------------------

ఏమో మరి..
ఇన్ని ప్రష్నలకి సమాధానం దొరకక సతమతమవుతుంటె..
పిరికి చర్య అంటడేందో మరి చంద్ర బాబు..
ఎమో మరి..మీకే తెల్వాలె..
జగమెరిగిన జగన్నాటక సూత్ర ధారులు…
నీటముంచినా, నిలువునా కాల్చినా
మీ మాటే మా వేద మంత్రం..
మీ సమైక్యతా, అభివ్రుద్దే మా అంతిమ ధ్యేయం..
మీ కాలి కింద చెప్పులం..
నాలుగు కోట్ల అనాధలం..
సీమాంధ్రప్రదేష్ సమైక్యాంధ్ర సాక్షిగా
వెయ్యి కాలాలు బాగుండాలె..
మీరు, మీ పిల్లలు అందరూ సల్లగ ఉండాలె..
మీ పొలాల్ల మా నీల్లు కలకాలం పారాలె..
మీరందరు మా జాగల్ల సుఖం గ ఉండాలె..
మీ పోరగాల్లందరికి ...

No comments:

Post a Comment