Wednesday, March 31, 2010

స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ హక్కు

స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ హక్కు ఆంధ్ర సీమ రాజకియవేతల కుటిల ఎత్తులు,
కుసంస్కారం. నాలుకలు చీరేస్తామనే సంస్కారం ఒక్క ఆంధ్ర సీమ రాజకీయవేతలకు సొంతం.
నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో నోటికి వచ్చినది వాగితే వారి పాత్ర
బట్టబయలౌతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే అరేబియా దేశాల్లో ముందు కటకటాల వెనక్కి
తోలి ఆ నాలుక చేసిన తప్పుకి తగిన దేహ శుద్ధి జరుగుతుంది. మజ్లిస్కి జగడపాటికి
హైదరాబాదులో వక్ఫ్ భూముల ద్వార ఉన్న చుట్టరికం లోకమంతా తెలుసును. హైదరాబాదులో
హిందూ ముస్లిముల మధ్య వైరాన్ని పెంచి తమ పెద్దరికాన్ని ఈ ప్రాంతం మీద తమ
పట్టుని నిలుపుకొనే ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన మరు క్షణం నుండే మొదలు
పెట్టిన ఆంధ్ర రాయలసీమ నాయకులు ఇక్కడ జరిగిన ఆస్తి, ప్రాణ, మాన నష్టాలకు
బాధ్యులు. కుసంస్కారుల కుటిలనీతులు ఈసారి తెలంగాణా ఉద్యమాన్ని తప్పు దోవ
పట్టించలేవని ఎప్పటికప్పుడు వారి కుటిలనీతులు బట్టబయలు చేయబదతావని వారి
వదరుబోతుదనం వారి కుసంస్కారం వారి నేర చరిత్రలు మీడియా ద్వార ప్రపంచం
గమనిస్తూనే ఉందని తమ పరిధులు తెలుసుకొని మాట్లాడడము ప్రవర్తించడము తమ
ఆరోగ్యానికి ఉనికికి మంచిదని తెలుసుకోండి, వలస రాజకీయవేత్తల ప్రభుత్వం తమను
అన్ని వేళల కపాడుతున్దనుకోవద్దు. జై తెలంగాణా వలస రాజకీయవేత్తల ప్రభుత్వం
బారినుండి తెలంగాణా విముక్తి మా ధ్యేయం. స్వతంత్ర తెలంగాణా రాష్ట్రం మా జన్మ
హక్కు.

Dear Telanganites,

One more time Andhra corporate lobby playing its crooked cards to divert the
telangana movement attention.

1) The flags all around the hyderbad on the eve of Milad-Un-nabi was
sponsored by Lagadapati through his third party channels. Every Masjid got
more than one lakh worth of flags and banners to fill the roads. The color
and design of the flags were same all around the city.

2) The same lobby distributed the flags and banners on Hanuman jayanthi. You
will find similar flags and banners all round the city.

3) The tension was created during the banners erection in old city. Already
Milad-Un-Nabi small flags were there all around the old city. When
organizers want to tie the hanuman Jayanthi flags over the already existing
banners tension was erupted. But an agreement was reached how to make the
arrangements for Hanuman jayanthi in front of MIM MLA’s and BJP leaders.

4) But suddenly in the midnight few miscreants removed the flags of Hanuman
Jayanthi in one area and also they removed Crescent flags in another area.
This created a breeding ground for further tensions.

5) We know what happened further. MIM party is banks upon money, even they
won’t bother welfare of Muslims, due to telangana movement so many muslim
sections are far away from the MIM.

6) To divert the telangana issue, and disturb the unification of Hindu and
Muslim forces in old city this plot was implemented.

7) Andhra lobby well knows that if old city agitates over telangana they may
not able to with stand in hyderbad.

8) When hindu-muslim riots were not there during 1948 razakar’s molestation,
why they were suddenly emerged after 1969 telangana movement.

9) Nizam used to pray the almighty that my people are so innocent, please
save these massom telangana people from clever and crooked Andhra people.

Let us spread this message and be united.

Sunday, March 28, 2010

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం


ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

జయ…

తరతరాల చరితగల తల్లీ నీరాజనం


తర…
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై…
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ

గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్

జై…

జానపదా జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర

అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం
జై…
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం

అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం

సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద

సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద
జై…
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె

స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి

జై…

Saturday, March 27, 2010

జై ఆంధ్ర.ఒక ఆంధ్ర స్టూడెంట్ కామెంట్స్ ఆన్ తెలంగాణా

జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర.

ఆంద్ర ప్రదేశ్ విభజన వల్ల ఆంద్ర లో ఉన్న సామాన్యునికి ఏమి నష్టం?? అసలు ఏమి లాభం ?? ఈ ఆందోళన లతో ఎంత కాలం విభజన ని అడ్డుకొని .. ఏమి సాధిస్తాం?? విభజనికి ఇంక మనం మానసికం గా సిద్దం అవ్వవలసిందే..
విశాఖ నుండి రాజధాని వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం.. సరైన వైద్యం కోసం రాజధాని.. అక్కడ చిత్కారాలు .. ఈ కర్మ మనకి అవసరమా? మనమూ ఉప్పు .. కారమే గా తింటున్నాం.. విడి పొతే మనకి మనం బతకలేమా? విజయవాడో.. విశాఖో.. రాజమండ్రి నో.. రాజధాని అయితే మనం అభివ్రుది చేసుకోలేమా? ఇక్కడ మనం కొంచెం విశాల హృదయం తో.. ఆలోచిస్తే.. అర్ధం అవుతుంది..
మాట్లాడితే హైదరాబాద్ పోతుంది అంటారు.. ఎక్కడికి పోతుంది.. పాకిస్తాన్ లో కలిసి పోతుందా? ? హైదరాబాద్ ..ఆంద్ర ప్రదేశ్ రాజధాని కాబట్టే అంత అభివృధి చెందినది.. రేపు ఇక్కడో రాజధాని ఏర్పడితే అదే స్థాయి అబివ్రుది ఖాయం.. .. సాఫ్ట్ వేర్ కంపనీలు అన్ని హైదరాబాద్ లో ఉంటే...ఏమైంది... రేపు మన రాజధానికి వస్తాయి.. మన వాళ్ళు బెంగళూరు.. చెన్నై వెళ్లి ఉద్యోగాలు చెయ్యడం లేదా? ఇదీ అంతే.. హైదరాబాద్ వెళ్లి చేస్తారు.. అసలు హైదారాబాద్ అనే ఫోభియా ఎందుకు అంటే అన్నింటికీ అదే రాజధాని అయ్యింది.. ఆ తప్పే కొంప ముంచింది. ఒక్క సాదారణ పరిపాలనకే రాజధానిగా ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యాగాలకి, సాంకేతిక విద్యకి ,, వైద్య విద్యకి. ,, వైద్యానికి., న్యాయానికి ,, పారిశ్రామికానికి ...ఇలా చెప్పుకుంటే అన్నింటికీ హైదరాబాద్ నే రాజధాని చేసి పాలకులు తప్పుచేసారు..
అదే తప్పు రేపు ఆంధ్ర ఏర్పడితే జరగకూడదు..
ఇంకా నీళ్ళు రావు అని గోల ... ఎందుకు రావు..? మనం ఎన్ని నీళ్ళు వృధాగా సముద్రం లోకి వదిలేయడం లేదు? ఎన్ని నీళ్ళని వాళ్ళు ఆపగలరు ? మనం తమిళనాడు కి నీళ్ళు వదలడం లేదా? ఇదీ అంతే..
విభజన కోరుకొనే వాళ్ళల సంగతి మనకెందుకు.. వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో మనకెందుకు? విదిపోతాం అంటున్నప్పుడు విడిపోవడమే... ఇంతా కాలం బతిమిలాడి.. బెదిరించి కాపురం చేయిస్తాము? విదిపోదామనుకుంటున్న ఎవరికీ అయిన ఇదే వర్తిస్తుంది.. రాయల సీమ అయిన.. మన్య సీమ అయిన, ఉత్తర ఆంధ్ర అయినా ..రేపు ఇంకోటి ఏదైనా... .. దీనికోసం మన ఆస్తుల్ని మనం తగల పెట్టు కోవడం.. మన చదువుల్ని.. మన భవిష్యత్తు ని మనమే పాడు చేసుకోవడం అవసరమా?
సమైక్య ఆంద్ర అనేది అంతా కోట్లకు..కోట్లు పడగలెత్తి ... హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన వాళ్ళే...తప్ప సగటు మనిషి కాదు..అనేది అందరికి తెలిసిందే...
రేపు ఎలాగు శ్రీకృష్ణ కమిటి ఎలాగు తెలుస్తుంది.. ఆగండి.. చూస్తూనే ఉండండి,.
నేను పుట్టింది... పెరుగుతుంది... కోస్తా ఆంధ్ర లోనే... ఆయ్... అదేనండి.. రాజమండ్రి .. నుండి.. నాకు వీలనంత త్వరలో ఆంధ్ర రాష్ట్రము చూడాలని ఉంది.. అప్పుడు నేను నా రాజధానికి ....ఉదయాన్నే ఇంట్లో టీ తాగి... నా 180 CC బైక్ మీద రాజధాని వెళ్లి పని చూసుకొని... సాయంకాలానికి వీలుంటే మద్యాహ్నం బోజనానికి ఇంటికి వచేస్తాను..
నా వాదన ఇదీ ... నా వాదనలో తప్పు ఏమీ లేదు.. మీకు వేరే వాదన ఉంటే అదీ తప్పు కాదు.. ఎవరి వాదన వారిది.. చివరిగా వచ్చేది... జై ఆంధ్ర.. జై.. జై..ఆంధ్ర..
కామెంట్స్... తో.. నా ప్రాంతం వాళ్ళే నన్ను ఉతికేస్తారు అని తెలుసు... ఎంత కాలం ఉతుకు తారు... ?? ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకే కదా?? ఏమంటారు??
source: http://www.innervoice.co.cc/2010/03/blog-post_22.html

Friday, March 26, 2010

శవాల మీద లేస్తున్న జెండాలు

కాలుతున్న శవాలు, నేల
రాలుతున్న పరిమళాలు
పచ్చి మాంసపు వాసనలపై
ఎగురుతున్నాయ్ చూడు
సమైక్యాంద్ర జెండాలు !!

యువత ఆత్మహత్యలు, కాదు ఇవి
బడుగు జీవుల హత్యలు
ప్రత్యేక పోరు వెనుక
సాగుతున్నాయ్ చూడు
శవపు రాజకీయాలు !!

అభివృద్ధి మంత్రాలూ
అతికొద్ది పంపకాలు
అణగారిన జనాలపై
లేస్తున్నాయ్ చూడు
పెత్తందారి కోటలు !!

ఇలాత్కయలమ్మే ఇస్మయిలూ, మోర్లూడ్చే మల్లిగాడు
వీళ్ళ కోసమేనట నేటి ఈ సిత్రాలు
పేదరికం ముసుగు వెనక
చిందులేస్తున్నాయ్ చూడు
కోట్లకు పడగలెత్తిన తారలు !!

కలిసుంటే స్వర్ణయుగం, విడిపోదామంటే

మారుతుంది వర్ణం
వెర్రివాదనొకటి పైకిలేచి
బ్రమపెడుతోంది చూడు
నక్స లైటు భూతం !!

ఒక్కటవుతున్నాయి జిత్తుల నక్కలు
ఖాళీ అవుతున్నాయి ధనం మూటలు
ఇపుడు చచ్చిన శవాల పై సైతం
విరుగున్నాయ్ చూడు
ఖాకీల చేతిలో లాఠీలు !!!

ఓ .యు. విద్యార్థి గర్జన

ఓ .యు. విద్యార్థి గర్జన
ఓ యువరక్తపు ఘోషణ
రాజధాని నడిబొడ్డున
రగిలిన సంఘర్షణ

శతాబ్దాల గతమంతా
తిరగబడ్డ సోదరా ..
దశాబ్దాల కాలమంత
ధగాపడ్డ తమ్ముడా ..
వృధా కాదు నీ స్వేదం
యదార్థాల సాక్షిగా
యావత్ తెలంగాణా ఉంది
సదా నీకు తోడుగా ..

వాటాలు ఒకరికి
తూటాలు ఒకరికా?
మాటల్లో కోటలూ
చేతల్లో గోతులా ?
ఇక చాలు ఇక చాలు
బానిసపు బతుకులు
ఇకనైనా పీల్చనీయ్
స్వేచ్చా వాయువులు

కలిసొస్తే స్వాగతం
మా మనసులు సముద్రం
ఎదురొస్తే స్వేచ్చకు
విప్లవాల వీరులం

శ్రమ జీవులు, శ్రామికులూ
కర్షకులు కార్మికులూ
బడి పిల్లలు, మేధావులు
విడిపోతాం ఇకనైనా
సెలవంటూ చెపుతూంటే
వృద్ది అంటావ్, సమిష్టి అంటావ్
కలిసుండాలని శాసనం చేస్తావ్
ప్రజలంతా ఒకే మాటపై
నిలబడ్డారు అంటావేం
ప్రజలనే జాబితాలో
తెలంగాణ బిడ్డలను
ఇక నైనా చేర్చలేని
మాటలోని ఆ సత్యం
నీ చేతలోని ఔదార్యం
చూసి నిట్టూర్చే గదా
ఈ లోకం, నా ప్రాంతం
సమైక్యాంద్ర పదంలోనే
మతలబెందో అర్ధమాయే
తెలంగాణ కేక్కడిదిక నీ
నిఘంటువులో ఓ స్థానం

విడిపోయే వాన్నిగదా
ఓదార్చే అవసరం మరి
కలిసుండే వాని వెనుక
పడతారేం విడ్డూరం

నీది కాని గోచిపైన
ఎందుకింత కలకలం
పరాయి గడ్డమీద
ఏమిటింత పెత్తనం

ముళ్ళ మధ్య విరిసింది
అందమైన తామరం
తెలంగాణ గుండె రా
అది భాగ్యమైన నగరం

పువ్వు దోయ చూశావో
ఒళ్ళు గుల్ల తెలుసుకో మా
నవ్వు దోయ చూశావో
రేపు నీకు లేదుపో

నిజం ఉద్యమం, నివురు జర్నలిజం.......ఉస్మానియా విద్యార్థులు

ఉస్మానియా విద్యార్థులు - అందులో మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అండతో పోలీసులు లాఠీచార్జ్ చేసి దారుణంగా హింసించారు. దీని వెనుక విద్యార్థుల తప్పులేదని ఇదంతా తెలంగానేతరుల కుట్రని తెలిసినా మీడియామాత్రం అంతగా స్పందించలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా కలిసి పన్నిన కుట్ర. దీన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది  ..........

విశాల నిశీధి విలయతాండవం
వికార మానవ దురహంకారం
అనాది భారత యుగాల మడుగున
ఆరాధనతో ఆదిగకొలిచిన
మాతా, సోదరీ, యువతీ, దేవతా ..
నవీన భారత పునీత వనితా !


హక్కులకోసం పాకులాడితే ..
ఎదరొమ్ములపై పోలీసు బూటూ
పొత్తికడుపులో తుపాకిపోటు,
చెదిరిన జుట్టొక గుర్రపుకల్లెము
విద్యాలయమే నిలువెత్తు సాక్షము
నీ దేహమే తారురోడ్డుకు నేస్తము ..


చిమ్మ చీకట్లు సూర్యున్ని మింగేసినయ్ ..
నల్ల మబ్బులు చంద్రున్ని కమ్మేసినయ్ ..
వీదిదీపాలను డబ్బు చేతులు కప్పేసినయ్ ..
'ఆడ' పదాన్ని మహిళా సంఘాలు అమ్మేసినయ్ ..
మానవత్వాన్ని ప్రాంతీయతత్త్వం కొనేసింది !


లాఠీలు బాధ తాళలేక
                    ముక్కలుగా విరిగిపోయినయ్ !
రబ్బరు బుల్లెట్లు దారుణాన్ని చూడలేక సిగ్గుతో
                     యువత గుండెల్లో తల దాచుకున్నయ్ !!
అరుపులూ, కేకలూ, ఆక్రోశాలూ, ఆక్రందనలూ ..
రక్తాలూ, గాయాలూ, బాధలూ, వ్యధలూ ..
చిత్తు కాగితాలపై పిచ్చి భావాలయినయ్ !

హాస్టలురూము ఫ్యానూ, సెల్టవర్ అంచూ..
ఆడిటోరియం రూఫూ, బలిదానాలకు వేదికలయినయ్ !!

ద్రౌపది వ్యధనా? కీచక వధనా??
అంతులేని ప్రశ్నలరాత్రిని ' రోషం(?)' కమ్మేసింది
నిజం ఉద్యమం, నివురు జర్నలిజం..
నేనింకా బతికే ఉన్నానంటూ .
తెల్లవారగానే..ఉన్నత న్యాయస్థానం??

ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!

దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రంకోసం చేస్తున్న పోరుకు ఫలితం, కలలు సాకారమయ్యే రోజులివి. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ప్రజలంతా ఉద్యమంలోకి దూకుతున్నారు. నాయకులు, పెట్టుబడిదారులు, కుల, మత చాందసవాదులు ఏ స్వార్థంకోసం తపిస్తున్నారో తెలియదు గానీ, సామాన్య ప్రజానీకం, యువత మాత్రం ఉద్యమాన్ని భుజాలనెత్తుకొని, పోలీసు లాఠీలకు, అధికారుల బెదిరింపులకు, తెలంగాణవ్యతిరేకుల ధనాశకు తలొగ్గకుండా, ధైర్యంతో ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. ఏ పాపం ఎరుగని నిరుపేద యువతీ యువకులు కళ్ళముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్రం కొందరి అహంకార, అధికార, ధన బలం ముందు తలవంచుకు పోతుంటే, ఇక రాష్ట్రసాధన కలగానే మిగిలిపోతుందనే భయంతో, బాధతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది, ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ప్రకటన చేసిన తర్వాత, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనక దాగి ఉన్న కుట్ర గురించి, దానికి పాల్పడ్డ వాళ్ళకున్న బలం గురించి.
   తెలంగాణ వ్యతిరేక పెట్టుబడుదారులు , రాజకీయ నాయకులకు కేంద్రం తలొగ్గింది. వీరికి అంత బలం ఎవరిచ్చారు? అది ఇక్కడి ప్రజలే.. ఇది నిజం. ప్రస్తుత రాజకీయ ప్రభావాలను తట్టుకుని ప్రభుత్వాలు నిలవాలంటే ఆర్ధికంగా పార్టీలు బలంగా ఉండాలి. కారణం ఏదైనా మన రాష్ట్రంలో ఆర్ధికంగా బలంగా ఉన్నది సీమాంద్ర ప్రాంతానికి చెందినవారే. కాని వారి వ్యాపార వృద్ధికి తోడ్పడ్తుంది మాత్రం తెలంగాణ ప్రజలే. ఆంద్ర, రాయలసీమలు రెండూ పెట్టుబడులలో ఒకదానితో ఒకటి  పోటీపడుతున్నై. వారికున్న ప్రాంతీయ అభిమానంతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో గట్టిపోటీ ఉంటుంది. అందుకే వారి వ్యాపారాలు అక్కడ తొందరగా వృద్ధిచెందవు. తెలంగాణ ప్రాంతం మాత్రం వీరి ఉత్పత్తులను ప్రాంతాలకతీతంగా వినియోగిస్తారు. ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యాపారాల్లో పోషించే పాత్ర తక్కువ కావడంవల్ల అధిక లాభాలనార్జించే అన్ని రంగాల్లో సీమాంద్ర పెట్టుబడిదారులే కనిపిస్తారు.
  అంటే ఒకవైపు తెలంగాణా ప్రజల సంపదతో వ్యాపారం చేస్తూ, అదే సంపదతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలే తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్లు. అలాంటప్పుడు ఎన్ని ఉద్యమాలు వచ్చినా పెద్దప్రయోజనం ఏమీ ఉండదు. ఏ ఉద్యమమయినా  ఫలితాలను పొందాలంటే, ఉద్యమం ఎక్కువకాలం నిలబడాలి. ఉద్యమ విధి విధానాలు, ఆశయాలూ, లక్షాలూ సామాన్యుడిని చేరాలి. నేటి పరిస్తితుల్లో ఎలాంటి విషయమైన చిటికెలో ప్రపంచమంతా వ్యాప్తి  చెందించే మాద్యమం TV చానల్స్ మాత్రమే. మరి తెలంగాణ ఉద్యమాన్ని సద్భావంతో, సదుద్దేశ్యంతో సూటిగా లక్ష్యం వైపు గురిపెట్టగలిగే రీతిలో చూపించే ఏ ఒక్క ఛానల్ అయినా ఉందా అంటే అది అంతుదొరకని ప్రశ్నే. ఒకవేల ఉన్నా వాటికున్న ఆదరణ అంతంతమాత్రమే. ఒక విషయం మంచిదా, చెడ్డదా అని నిర్ణయించేది, పదిమందీ దాని గురించి ప్రస్తావించడం వల్లే. ఈ నగర జీవితంలో ఆ పదిమందీ తనే అయి పోషిస్తున్నాయి T V చానల్స్. అందుకే ఒక్క రోజులో తివారి విటుడయ్యాడు, రాజశేఖర్ రెడ్డి దేవుడయ్యాడు. ఇదంతా మీడియా సృష్టి కాదా?
 తెలంగాణాలోని ప్రతి పల్లె అగ్నిగుండంలా ఉంది. రేపటి తరానికి దిశా నిర్దేశాలు సూచించే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు మానవత్వం మరిచి యువతీ యువకులను దారుణంగా హింసిస్తున్నారు. ఇన్ని జరిగినా ఏ టి.వి ఛానల్లో కూడా వీటికి సరైనస్తానం  దొరకకపోవడం బాదాకరం. చాలా సందర్బాలలో తెలంగాణ ప్రజల మద్య విబేదాలు పెంచే రకంగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్ తప్ప ఇది న్యాయమైన పోరాటం అని చెప్పే టి.వి చానల్స్ కరువయ్యాయ్. ఉద్యమం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని గాయాలపాలవడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ ఉద్యమం ఓ పోరు. ఈ పోరులో నెగ్గాలంటే వ్యతిరేక శక్తులను బలహీన పరచాలి. ఇక్కడ వ్యతిరేకతకు ఉన్న బలం డబ్బు, అధికారం. ఆర్తికంగా బలహీనమైతే రాజకీయంగా ఎదగడం కష్టం. అందుకే సీమాంద్ర వస్తు, వ్యాపార, సేవలను బహిష్కరించాలి. అందులో బాగంగా అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఉద్యమాన్ని వక్రీకరించి, నీరుగార్చే టి.వి చానల్స్ ని ఆదరించక పోవడం లేదా వాటిని పూర్తిగా తొలగించడం. దీంతో ముందుగా యువత బలిదానాలు ఆగిపోతాయి. ప్రజలకు నిజాలు తెలవకపోయినా అబద్ధాలకు, అభూతాలకు తావుండదు. ఎప్పుడూ ఎదుటివాడిని వేలెత్తి చూపే చానల్స్ T.R.P(Target Rating Point)  లు పడిపోయి ఇక ముందైనా నిజాలను చూపించే ప్రయత్నాలు చేస్తాయి. ఆకలి కేకలకూ, కన్నీటి వ్యధలకూ గుర్తింపు దక్కుతుంది. ఉద్యమాలు వర్ధిల్లుతాయి. 


ఉద్యమం వర్ధిల్లాలి! తెలంగాణ సాధించాలి!!